దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు

Jun 28 2025 5:45 AM | Updated on Jun 28 2025 7:27 AM

దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు

దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు

ఒంగోలు సబర్బన్‌: టిడ్కో ఇళ్లకు సంబంధించిన పెండింగ్‌ పనులు పూర్తి చేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు అందిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి పి.నారాయణ తెలిపారు. ఒంగోలు అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీకి సంబంధించిన కార్యకలాపాలపై సమీక్షించేందుకు శుక్రవారం ఆయన ఒంగోలు వచ్చారు. ప్రకాశం భవనంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణతో కలిసి సమీక్షించారు. అనంతరం సంబంధిత వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. టిడ్కో ఇళ్లను 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణమైనవిగా మూడు కేటగిరీలుగా చేపట్టినట్లు చెప్పారు. వీటిలో 365, 430 చదరపు అడుగుల ఇళ్లను ముందుగా పూర్తిచేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో మరో 15 రోజుల్లో ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధులు నిర్మాణ పనులు చేపడతారని ఆయన వెల్లడించారు. ఒంగోలులో రోడ్డు విస్తరణ వలన నష్టపోయే వారికి టీడీఆర్‌ బాండ్స్‌ ఇస్తామని ప్రకటించారు. సమీక్షలో మార్కాపురం ఎమ్మెల్యే కె.నారాయణరెడ్డి, ఒంగోలు నగర మేయర్‌ సుజాత, డిప్యూటీ మేయర్‌ సూర్యనారాయణ, ఒంగోలు మున్సిపల్‌ కమిషనర్‌ కె.వెంకటేశ్వరరావు, అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు అభినందనలు

ఒంగోలు సబర్బన్‌: కలెక్టర్‌గా ఏడాది కాలం పూర్తి చేసుకున్న ఏ.తమీమ్‌ అన్సారియాను ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో కలిసిన రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు పిన్నిక మధుసూదనరావు ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. ఉద్యోగులకు అండగా ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ను అభినందించిన వారిలో ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్‌ వింగ్‌ నాయకులు, కలెక్టరేట్‌ సిబ్బంది ఉన్నారు. రెవెన్యూ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పిన్నిక మధుసూదనరావుతో పాటు జిల్లా కోశాధికారి ఊతకోలు శ్రీనివాసరావు, కలెక్టరేట్‌ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్‌, ప్రశాంత్‌, ఏపీ జేఏసీ ఉమెన్‌ వింగ్‌ చైర్మన్‌ జయలక్ష్మి, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ నాగలక్ష్మి, కలెక్టరేట్‌ సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.

ఒంగోలులో రోడ్డు విస్తరణలో నష్టపోయే వారికి

టీడీఆర్‌ బాండ్స్‌

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి నారాయణ

ఏడాది కాలం పూర్తి చేసుకున్నందుకు అభినందించిన రెవెన్యూ అసోసియేషన్‌ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement