అరకొర వసతులతో కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

అరకొర వసతులతో కౌన్సెలింగ్‌

Jun 27 2025 4:47 AM | Updated on Jun 27 2025 4:47 AM

అరకొర వసతులతో కౌన్సెలింగ్‌

అరకొర వసతులతో కౌన్సెలింగ్‌

ిసంగరాయకొండ: ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులకు స్థానిక డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కౌన్సెలింగ్‌కు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. అయితే వందల సంఖ్యలో వచ్చిన వారికి సరైన వసతులు కల్పించడంలో గురుకుల పాఠశాల యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యవైఖరి అవలంబించారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. వచ్చిన వారి కోసం చాలీచాలని షామియానా వేశారు. కనీసం కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో చెట్ల కింద పడిగాపులు కాయాల్సి వచ్చింది. పాఠశాలలో తరగతి గదులు ఖాళీగా ఉన్నా ఆ గదుల్లో వసతులు కల్పించకుండా ఎండకు వదిలేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇబ్బందులు పడిన విద్యార్థులు, తల్లిదండ్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement