
కలెక్టర్ను అభినందించిన ఎన్జీఓ నాయకులు
ఒంగోలు సబర్బన్: జిల్లా కలెక్టర్గా ఏ.తమిమ్ అన్సారియా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో కలిసిన అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.శరత్బాబు, కార్యదర్శి ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కె.శరత్బాబు బంగారు బాల్యం కార్యక్రమానికి స్కొచ్ అవార్డ్ సాధించి దేశంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారని, భవిష్యత్లో కూడా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తారన్నారు. కార్యక్రమంలో ఒంగోలు పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి మంజేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు పి.రామాంజనేయులు, సంయుక్త కార్యదర్శి షేక్ మోమిన్, రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ పి.మాధవి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కె.కోటేశ్వరమ్మ, ఒంగోలు పట్టణ ఉపాధ్యక్షులు షేక్ కరీముల్లా, వి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.