
కలల సాకారానికి చదువే మార్గం
పుల్లలచెరువు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. మండలంలోని నరజాములతండాలో గురువారం పర్యటించి పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉన్న మౌలిక వసుతులు, విద్యార్థులకు అందచేసిన కిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల నోట్పుస్తకాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అధునిక పద్ధతిలో బోధన చేయాలని సూచించారు. ప్రస్తుతం విద్యార్థుల భవిష్యత్కు చక్కటి అవకాశాలు ఉన్నాయని, కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు చేరుకునేందుకు సులభ మార్గాలు ఉన్నాయని సూచించారు. ప్రతి విద్యార్థి కలలు కని, వాటిని నిజం చేసుకోవాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. ప్రతి రోజు విద్యార్థులను పాఠశాలలకు పంపేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. సబ్కలెక్టర్ వెంకట త్రివినాగ్, డీఎఫ్ఓ సందీప్కృపాకర్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, సర్పంచ్ బాలునాయక్ పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ