
బాల్య వివాహాల నియంత్రణ ప్రధానం
● పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చూడాలి ● సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ సమీక్షలో జిల్లా కలెక్టర్
ఒంగోలు సబర్బన్: పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా శ్రద్ధ తీసుకోవాలని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాల్య వివాహాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, 0–6 ఏళ్ల పిల్లల ఆధార్ ఎన్రోల్మెంట్, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి, మరుగుదొడ్ల మరమ్మతులు, ఇంకుడు గుంతల నిర్మాణాల పురోగతి, పౌష్టికాహారం పంపిణీ తీరుపై సమీక్షించారు. మాతా శిశు మరణాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. బాల్య వివాహాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ సువర్ణ, డీసీపీఓ దినేష్ కుమార్తోపాటు సీడీపీఓలు పాల్గొన్నారు.
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని
రక్షించిన పోలీసులు
కంభం: రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కంభం ఎస్సై నరసింహారావు తమ సిబ్బందితో కలిసి రక్షించారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం కంభంలో చోటుచేసుకుంది. వివరాలు.. కంభం పంచాయతీలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ రఫీ మద్యం మత్తులో స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఎస్సై హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రఫీని అదుపులోకి తీసుకున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.