
సత్తాచాటిన బల్లికురవ ఎడ్లు
పామూరు: మండలంలోని బొట్లగూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కమ్మవారిపాలెం, రఘునాథపురం సమీపంలోగల అచ్చమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన ఎడ్ల బండలాగుడు పోటీల్లో బాపట్ల జిల్లా బల్లికురవ ఎడ్ల జత ప్రథమస్థానంలో నిలిచింది. పోటీల్లో మొత్తం 4 జతల ఎడ్లు పాల్గొన్నాయి. బల్లికురవకు చెందిన పావులూరి వీరాస్వామిచౌదరి ఎడ్లు నిర్దేశిత సమయంలో 2 వేల అడుగుల మేర బండ లాగి ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాయి. మార్కాపురం మండలం బొడిచర్ల గ్రామానికి చెందిన తిండి నక్షత్రారెడ్డి, ధ్రువసాయిరామరెడ్డి ఎడ్ల జత ద్వితీయస్థానం, బేస్తవారిపేట మండలానికి చెందిన లక్కు నాగశివశంకర్ ఎడ్లు తృతీయ స్థాఽనం, నంద్యాల జిల్లా గడివేముల మండలం పెసరవాయికి చెందిన సయ్యద్ కలాంబాషా ఎడ్ల జత నాలుగో స్థానంలో నిలిచాయి. ప్రథమ బహుమతి రూ.50 వేలను పి.మల్లికార్జున సంపూర్ణ, ద్వితీయ బహుమతి రూ..30 వేలను మల్లికార్జున, కృష్ణకుమారి, గురజాల వెంకటేశ్వర్లు, పత్తిపాటి రమణయ్య, తృతీయ రు.20 వేలను గుర్రం మాల్యాద్రి, గణపతి, సుజాత, నాలుగో బహుమతి రు.10 వేలను డేరంగుల శ్రీను, ప్రశాంతి సమకూర్చగా ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు.
ఇద్దరు టీచర్లకు జాతీయ విద్యారత్న అవార్డు
కురిచేడు: మండలంలోని ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయినులను జాతీయ విద్యారత్న అవార్డు వరించింది. గొల్లపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు బిజ్జం రమాదేవి, కురిచేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు చెరుకూరి జ్యోతిర్మయికి ఛత్తీస్గడ్ కేంద్రంగా నిర్వహిస్తున్న నవాచారి గతి విధియాన్ గ్రూప్ అవార్డులు అందజేసింది. 2024–205 ఏడాదికిగాను ప్రకటించిన ఈ అవార్డులకు ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మంది ఎంపిక చేయగా అందులో కురిచేడు మండలానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయినులకు చోటు దక్కడం విశేషం. విద్యార్థులకు వినూత్నమైన, సత్ఫలితాలు ఇచ్చే రీతిలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులకు నవాచారి గతివిధియాన్ సంస్థ ఏటా అవార్డులు అందజేస్తోంది. అవార్డు సర్టిఫికెట్, మెమొంటో, పెన్ను స్పీడ్ పోస్ట్లో అందుకున్న ఇద్దరు టీచర్లను సహోద్యోగులు అభినందించారు.

సత్తాచాటిన బల్లికురవ ఎడ్లు

సత్తాచాటిన బల్లికురవ ఎడ్లు