
ఆరోగ్య యోగం
ఒంగోలు: అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని ఒంగోలులోని మినీ స్టేడియంలో శనివారం ఉదయం ఉత్సాహంగా నిర్వహించారు. ఒంగోలు మినీ స్టేడియంలో శనివారం ఉదయం నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, నగర మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగాచార్యుడు ఏడుకొండలు ఆధ్వర్యంలో యోగ ఔత్సాహికులతో కలసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ యోగా గొప్పతనాన్ని, ప్రయోజనాలను ప్రజలకు అందించాలన్న ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఆత్మను, మనసును, శరీరాన్ని ఏకం చేసే ఏకై క సాధనం యోగా అని, ప్రతి ఒక్కరూ తమజీవితంలో యోగాని భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మే 21 నుంచి నెల రోజుల పాటు జిల్లాలో యోగాంధ్ర మాసోత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు అన్నీ శాఖల అధికారులు, సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు, యోగ సాధకులకు కలెక్టర్ తమీమ్ అన్సారియా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర స్థాయి యోగ పోటీల్లో జిల్లాకు చెందిన ఏడుగురు గెలుపొందడం సంతోషదాయకమన్నారు. యోగ సాంగ్కు రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మొదటి బహుమతి వచ్చిందని చెప్పారు. యోగాంధ్ర మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషిచేసిన జిల్లా అధికారులకు, యోగ సాధకులకు మెమొంటోలు ప్రదానం చేశారు. స్వచ్ఛఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేశారు. మినీ స్టేడియం ఆవరణలో ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఆర్వో చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జెడ్పీ సీఈఓ చిరంజీవి, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, సెట్నల్ సీఈఓ శ్రీమన్నారాయణ, డీఆర్డీఏ, మెప్మా పీడీలు నారాయణ, శ్రీహరి, డీఈఓ కిరణ్ కుమార్, పశు సంవర్థక శాఖ జేడీ రవి కుమార్, డీఎస్ఓ పద్మశ్రీ, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, డీఎస్డీఓ రాజరాజేశ్వరి, ఆయుష్ ఆర్డీడీ పద్మజాతి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఒంగోలులో ఉత్సాహంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం
యోగాసనం వేస్తున్న ఎస్పీ ఏఆర్ దామోదర్, జిల్లా అధికారులు

ఆరోగ్య యోగం

ఆరోగ్య యోగం