
గంజాయి కేసులో ఆరుగురు అరెస్టు
గిద్దలూరు రూరల్: గంజాయి కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు శనివారం స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మండలంలోని వెంగళ్రెడ్డిపల్లెకు చెందిన బిజ్జం వెంకట శ్రీరాంరెడ్డి అలియాస్ ఇంద్రసేనారెడ్డి, కె.ఎస్.పల్లెకు చెందిన మొలక మోహన్కృష్ణ, పొదలకుంటపల్లె గ్రామానికి చెందిన కాకాని నరేంద్ర, బేస్తవారిపేట మండలం చెన్నుపల్లెకు చెందిన లక్కంనేని వెంకట సుబ్బయ్య, తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అర్తమూరు గ్రామానికి చెందిన కొవ్వురి ఉదయ్భాస్కర్, ఒడిశా రాష్ట్రం కోరావూట్ జిల్లా పొండేయే గ్రామానికి చెందిన అడ్కటీయ రంజీత్లను గంజాయి కేసులో గిద్దలూరు ఒంగోలు హైవే రోడ్డులోని పాత ఎస్ఆర్ పెట్రోల్ బంకు వద్ద అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వారి నుంచి 6 కిలోల గంజాయితో పాటు రూ.60 వేల నగదు, తూకం పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గిద్దలూరు మండలం వెంగళ్రెడ్డిపల్లెకు చెందిన బిజ్జం వెంకటశ్రీరాంరెడ్డి అలియాస్ ఇంద్రసేనారెడ్డి, కె.ఎస్.పల్లెకు చెందిన మొలక మోహన్కృష్ణ, పొదలకుంటపల్లె గ్రామానికి చెందిన కాకాని నరేంద్ర, బేస్తవారిపేట మండలం చెన్నుపల్లెకు చెందిన లక్కంనేని వెంకట సుబ్బయ్యలు చెడు అలవాట్లకు బానిసలై డబ్బును సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయిని విక్రయించేందుకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో వీరు నలుగురు గంజాయిని తూర్పుగోదావరి జిల్లా ఉదయ్భాస్కర్ ద్వారా ఒడిశాకు చెందిన రంజీత్ల వద్ద నుంచి కిలో గంజాయిని రూ.10 వేల ప్రకారం కొనుగోలు చేసి గిద్దలూరు పరిసర ప్రాంతాలల్లో 10 గ్రాముల గంజాయిని రూ.500 ప్రకారం విక్రయిస్తుంటారని తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ నాగరాజు వివరించారు. సీఐ కె.సురేష్, ఎస్సై శివనాంచారయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రైలు నుంచి జారిపడి మహిళ మృతి
కంభం: ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి మహిళ మృతిచెందిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి కంభం రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. మేకల నవమ్మ (45) అనే మహిళ బెంగళూరు నుంచి అర్థవీడు మండలం దొనకొండ వెళ్లేందుకు ప్రశాంతి ఎక్స్ప్రెస్లో వచ్చింది. కంభం రైల్వేస్టేషన్లో రైలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ జారి కింద పడి మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు.

గంజాయి కేసులో ఆరుగురు అరెస్టు