జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా మాణిక్యరావు | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా మాణిక్యరావు

Jun 22 2025 3:26 AM | Updated on Jun 22 2025 3:26 AM

జీజీహ

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా మాణిక్యరావు

ఒంగోలు టౌన్‌: స్థానిక జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ మాణిక్యరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన వచ్చారు. ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డా.తిరుపతిరెడ్డి, అడ్మినిస్ట్రేటర్‌ కె.అద్దెయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.కిరణ్‌ కుమార్‌, ఆర్‌ఎంఓ డా.మాధవీలత, ఏఆర్‌ఎంఓ డా.చెంచయ్య, తదితరులు మాణిక్యరావును కలిసి అభినందనలు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

గాయపడిన వ్యక్తి మృతి

కొత్తపట్నం: రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వ్యక్తి శనివారం మృతిచెందాడు. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన మిట్నసల భరత్‌ కుమార్‌ (54) అల్లూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 19వ తేదీ పాఠశాలలో పని పూర్తి చేసుకుని టీవీఎస్‌ ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్లే సమయంలో కొత్తపట్నం నుంచి ఒంగోలు వైపు ఒకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు వెళ్తూ వేగంగా వచ్చి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో భరత్‌ కుమార్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. 108లో ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి మరో ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం భరత్‌కుమార్‌ మృతి చెందాడు. మృతుడి సోదరుడు మిట్నసల శరత్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపట్నం ఎస్సై సుధాకర్‌బాబు తెలిపారు.

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా మాణిక్యరావు 
1
1/1

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా మాణిక్యరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement