
నిరుద్యోగులకు కూటమి కుచ్చుటోపీ
మార్కాపురం టౌన్: నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించే వరకు ప్రతి నెలా రూ.3 వేలు చొప్పున ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం విస్మరించి నిలువునా మోసం చేసిందని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విమర్శించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేసేలా కూటమి సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 23న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించనున్న యువత పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మార్కాపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద యువత పోరుబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గంలోని నిరుద్యోగులైన యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరుకవాలని కోరారు. కూటమి ప్రభుత్వం హామీని అమలు చేయకుండా గత ఏడాది కాలంగా యువతీ యువకులకు రూ.36 వేల చొప్పున ఎగనామం పెట్టిందని ధ్వజమెత్తారు. సమావేశంలో నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జంకె కృష్ణారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు బి.వెంకట రామిరెడ్డి, తర్లుపాడు, కొనకనమిట్ల మండలాల యూత్ అధ్యక్షుడు బి.రమేష్రెడ్డి, బ్రహ్మారెడ్డి, నాయకులు మురారి వెంకటేశ్వర్లు, రామసుబ్బారెడ్డి, సర్పంచ్ డి.పెద్దమస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
23న యువత పోరుబాటను
విజయవంతం చేయాలి
నిరుద్యోగ భృతి హామీని కూటమి సర్కారు విస్మరించింది
మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా నెలకు రూ.3 వేలు ఇవ్వాలి
మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు