
లాసెట్లో నల్లగుంట్ల విద్యార్థి ప్రతిభ
కొమరోలు: మండలంలోని నల్లగుంట్ల గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ అలీ లాసెట్లో రాష్ట్రస్థాయిలో 1377వ ర్యాంకు సాధించాడు. ఇస్మాయిల్ అలీ గతంలో పీజీ సెట్లో రాష్ట్ర స్థాయిలో 99వ ర్యాంకు, 2020లో నిర్వహించిన పీజీ సెట్లో 2వ ర్యాంకు, 2022లో ఏపీఆర్సెట్ వృక్షశాస్త్రం విభాగంలో 15వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. తాజాగా లాసెట్లో ప్రతిభ చూపిన అలీని గ్రామస్తులు అభినందించారు.
బాధ్యతలు చేపట్టిన డీవైఈఓ
మార్కాపురం: మార్కాపురం డీవైఈఓగా నియమితులైన మామిళ్లపల్లి శ్రీనివాసరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన పొదిలి ఎంఈఓగా పనిచేస్తూ బదిలీపై మార్కాపురం డీవైఈఓగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నూతన డీవైఈఓను ఎంఈఓ శర్వాణి, ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి, సుబ్బారెడ్డి, రామాంజనేయరెడ్డి, సుధాకర్, చంద్రశేఖర్రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వీరారెడ్డి, రవిశేఖర్, సైమన్, రవిచంద్ర తదితరులు కలిసి అభినందనలు తెలిపారు.

లాసెట్లో నల్లగుంట్ల విద్యార్థి ప్రతిభ