విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

Jun 20 2025 6:55 AM | Updated on Jun 20 2025 6:55 AM

విద్య

విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

ఒంగోలు టౌన్‌: విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, చట్టంలోని సెక్షన్‌ 12(1)సి ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాల్లో 25 శాతం విద్యార్థులకు ఉచితంగా విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిల్‌ ఫర్‌ సిటిజన్‌ జిల్లా కో కన్వీనర్‌ ఎంఏ సాలార్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాలార్‌ మాట్లాడుతూ...ఇప్పటికీ అనేక మంది నిరుపేద విద్యార్థులు ఫీజులు చెల్లించే స్తోమత లేకపోవడంతో చదువులు మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జాప్యం కావడంతో కొందరు విద్యార్థులు కాలేజీలకు వెళ్లకుండా పనులకు వెళుతున్నారని తెలిపారు. విద్యా, వైద్యం ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం ద్వారా అందరికీ విద్యా సమానత్వం లభిస్తుందని చెప్పారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో కందుల ఐలయ్య వున్నారు.

గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పన

యర్రగొండపాలెం: గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఐటీడీఏ ప్రత్యేకాధికారి కె.నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని పాలుట్ల, గుట్టచేను గిరిజన గూడాల్లో దర్తి ఆబజన జాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు పక్కా గృహాలు, విద్యుత్‌ సౌకర్యం, ఆరోగ్యం, వ్యవసాయం, రోడ్లు, విద్య, హాస్టల్స్‌, టెలికాం సర్వీసులు, సాంకేతిక అభివృద్ధి, నైపుణ్య వికాసం లాంటి 17 మంత్రిత్వ శాఖల సమన్వయంతో 25రకాల కార్యచరణాలు చేపడుతున్మాన్నారు. గిరిజన గూడాలలో ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు కుల ధృవీకరణ పత్రాలు లేనివారిని గుర్తించి వారికి అందచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీడబ్ల్యూఓ లక్ష్మి పాలుట్లలోని ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యాఱఉ్తల బోధన వివరాలను హెచ్‌ఎం తాటి బైస్వామి, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాలుట్ల పీహెచ్‌సీ వైద్యాధికారి వెంకటేశ్వరనాయక్‌ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గిరిజనులను పరీక్షించారు. కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఓ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు కరంతోటి హనిమిబాయి, బోడా శ్రీశైలపతి నాయుడు, గిరిజన కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చెవుల అంజయ్య, వీటీడీఏ అధ్యక్షుడు నిమ్మల ఈదన్న, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వర నాయక్‌ పాల్గొన్నారు.

విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి 1
1/1

విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement