
దళితురాలినని వివక్ష చూపుతారా?
నాగులుప్పలపాడు: శ్రీనేను ఎస్టీ మహిళను, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ను అనే కారణంతో పంచాయతీ సెక్రటరీ, అధికార పార్టీ నాయకులు కలిసి వివక్ష చూపుతూ, హింసిస్తున్నారశ్రీని ఉప్పుగుండూరు గ్రామ సర్పంచ్ దేవరకొండ జయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో విలేకరుల ఎదుట తాను వివక్షకు గురవుతున్న తీరును వివరించారు. వారం రోజుల క్రితం వరకు పంచాయతీకి సెక్రటరీగా పనిచేసిన కిరణ్ అధికార పార్టీ నాయకుడు కనగాల శ్రీనుతో కుమ్మకై ్క పన్నుల ఆదాయం, 15వ ఆర్ధిక సంఘం నిధులు సుమారు రూ.30 లక్షలు కొల్లగొట్టారని ఆరోపించారు. ఈ ఏడాది మార్చి వరకు వసూలైన పన్నుల సొమ్ము చూపకపోగా, పంచాయతీ కార్మికులకు 3 నెలలుగా వేతనం నిలిపేశారన్నారు. కార్మికులు అడిగితే సర్పంచ్ సంతకం పెట్టలేదంటూ తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వేతనం గురించి ప్రశ్నిస్తే సర్పంచ్నైన తననే తీవ్ర పదజాలంతో దూషించారని, చెక్ పవర్ సైతం రద్దు చేయించారన్నారు. ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చాక చెక్ పవర్ తిరిగి వచ్చినప్పటికీ, తాను సూచించిన పనులేవీ చేపట్టడం లేదన్నారు. పంచాయతీని భ్రష్టుపట్టించిన కార్యదర్శిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని, పంచాయతీ నిధుల దుర్వినియోగంపై వాస్తవాలు నిగ్గు తేల్చాలని కోరారు.
డ్రంక్ అండ్ డ్రైవ్లో 22 మందికి జరిమానా
ఒంగోలు టౌన్: విజిబుల్ పోలీసింగ్లో భాగంగా గురువారం ట్రాఫిక్ పోలీసులు నగరంలో వాహనాలకు తనిఖీ చేశారు. మద్యం తాగి వాహనాలను నడుతున్న 22 మందిని కోర్టులో హాజరుపరిచారు. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.2.20 లక్షల జరిమానా కోర్టు విధించినట్లు ట్రాఫిక్ సీఐ పాండురంగారావు తెలిపారు. మద్యం తాగి వాహనాలను నడపరాదని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని అతివేగంగా వాహనాలను నడపరాదని సూచించారు.
ఉప్పుగుండూరులో రూ.30 లక్షల పంచాయతీ నిధులు కాజేశారు
కార్మికులకు మూడు నెలలుగా వేతనం నిలిపేశారు
అధికార పార్టీ నాయకులతో సెక్రటరీ కుమ్మకై ్క హింసిస్తున్నాడు
విలేకరుల ఎదుట సర్పంచ్ దేవరకొండ జయమ్మ ఆవేదన