
లాసెట్ ఫలితాలు విడుదల
ఒంగోలు సిటీ: పీజీ, బీఎల్, ఎల్ఎల్బీ లాసెట్ ఫలితాలను పద్మావతి మహిశా విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది. పీజీ లా కోర్సులో ప్రవేశాలకు ఒంగోలుకు సంబంధించి 78 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 65 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. 63 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒంగోలు నగరం గాంధీనగర్ కొత్తడొంకకు చెందిన కొర్సపాటి సంతానయ్య కుమారుడు ప్రశాంత్ మూడో ర్యాంక్ సాధించాడు. ప్రశాంత్ తన స్కూల్ ఎడ్యుకేషన్ను చీమకుర్తి పబ్లిక్ స్కూల్లో, ఇంటర్ను ఒంగోలు నారాయణ కాలేజీలో, బీటెక్ను గుంటూరు ఆర్వీఆర్ జేసీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్లో, ఆంధ్రా యూనివర్సిటీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాలేజీ ఆఫ్ లాలో ఎల్ఎల్బీ విద్య అభ్యసించారు. ఇదే విభాగానికి సంబంధించి మార్కాపురంలో 23 మంది దరఖాస్తు చేసుకోగా, 22 మంది పరీక్షకు హాజరై అందరూ ఉత్తీర్ణులయ్యారు. బీఎల్, ఎల్ఎల్బీ మూడు సంవత్సరాల కోర్సులో ప్రవేశాలకు సంబంధించి ఒంగోలు కేంద్రంలో 773 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 579 మంది హాజరు కాగా, 194 మంది గైర్హాజరయ్యారు. 576 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే మార్కాపురంలో 231 మంది దరఖాస్తు చేసుకోగా 183 మంది హాజరయ్యారు, 48 మంది గైర్హాజరవగా, 181 మంది అర్హత సాధించారు. బీఎల్, ఎల్ఎల్బీ ఐదు సంవత్సరాల కోర్సుకు సంబంధించి ఒంగోలులో 190 మంది దరఖాస్తు చేసుకున్నారు. 151 మంది పరీక్షకు హాజరవగా, 39 మంది గైర్హాజరయ్యారు. 139 మంది ఉత్తీర్ణత సాధించారు. మార్కాపురంలో 56 మంది దరఖాస్తు చేసుకోగా, 46 మంది పరీక్షకు హాజరయ్యారు. 43 మంది పాసయ్యారు.
23 నుంచి మగ్గం వర్క్లో ఉచిత శిక్షణ
ఒంగోలు వన్టౌన్: మగ్గం వర్క్లో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఒంగోలు రూడ్సెట్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 31 రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి కల్పించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 8309915577 నంబర్ను సంప్రదించాలని సూచించారు.