
ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్గా ఈశ్వర్ చం
ఒంగోలు సబర్బన్: డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్గా బట్టు ఈశ్వర్ చంద్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఈశ్వర్ చంద్ బదిలీపై ప్రకాశం జిల్లాకు వచ్చారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఈయనే డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్గా విధులు నిర్వర్తించనున్నారు. ఒంగోలు కర్మాగారాల తనిఖీ అధికారి–1, 2 కు కూడా ఈయనే ఇన్చార్జ్గా వ్యవహరించనున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్.శైలేంద్ర కుమార్ రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఓల్డ్ రిమ్స్ ప్రాంగణంలోని పాత మైన్స్ కార్యాలయాన్ని జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయానికి కలెక్టర్ కేటాయించారు.
దేవరంపాడులో పర్యాటక కేంద్రానికి భూముల పరిశీలన
ఒంగోలు సబర్బన్: ఒంగోలు రూరల్ మండలం గుండాయపాలెం మజారా దేవరంపాడు గ్రామంలోని ప్రభుత్వ భూములను బుధవారం జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాల కృష్ణ పరిశీలించారు. గ్రామంలోని సర్వేనెం.449/ఏ లోని ప్రభుత్వ భూముల్లో పర్యాటక కేంద్రంతో పాటు బకింగ్ హామ్ కెనాల్ పైన బ్రిడ్జి నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. పర్యాటక కేంద్రం ఏర్పాటు, బకింగ్ హామ్ కెనాల్ పైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు. దేవరంపాడు నుంచి పడవ ద్వారా బకింగ్ హాం కెనాల్లో ప్రయాణించి సముద్రం ఒడ్డుకు వెళ్లి ఆ వైపు భూములను కూడా పరిశీలించారు. జేసీ వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు రూరల్ తహశీల్దార్ ఎస్కే.నాయబ్ రసూల్, రెవెన్యూ, సర్వే శాఖ సిబ్బంది ఉన్నారు.
ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీపై చర్యలేవీ
ఒంగోలు టౌన్: జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నాయని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ అన్నారు. అధిక ఫీజులు, అధిక ధరలకు పాఠ్య పుస్తకాలను విక్రయిస్తున్న పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవని విమర్శించారు. బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి ఏ.కిరణ్ కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ... విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్ల వ్యాపారం మొదలైందన్నారు. పుస్తకాలు, యూనిఫాం, షూల పేరుతో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. దీనిని నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఆదేశాలున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, స్కూలు యాజమాన్యాలు పాటించడం లేదన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు పాఠశాలలు పుట్టుకొస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికై నా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలపై తగిన నియంత్రణ పెట్టాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు వి.కోటి, వెంకటరావు, సచిన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్గా ఈశ్వర్ చం

ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్గా ఈశ్వర్ చం