
తప్పుడు సాక్ష్యాలతో అక్రమ అరెస్టు ●
● వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు
బత్తుల బ్రహ్మానందరెడ్డి
ఒంగోలు టౌన్: అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ పాలనలో ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా లిక్కర్ పాలసీని అమలు చేసిందని చెప్పారు. రెడ్బుక్ కుట్రతోనే వైఎస్సార్ సీపీ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చెవిరెడ్డితో పాటుగా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, స్నేహితుడు వెంకటేష్ నాయుడును కూడా బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేశారన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని, కూటమి పాలకులు కక్ష సాధింపులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు.