
ఏడాది పాలనలో అరాచకాలు, అరెస్ట్టులు
చీమకుర్తి: గడిచిన ఏడాది పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు, అరెస్ట్లు తప్ప సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. చీమకుర్తిలో ఏడాది పాలనకు సంబంధించి చంద్రబాబు వెన్నుపోటుపై ప్రచురించిన ‘‘జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం’’ అనే పుస్తకాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి శివప్రసాదరెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఏదైనా చెప్పాడంటే చేస్తాడనే నమ్మకాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలుపుకున్నాడన్నారు. కానీ చంద్రబాబు మాత్రం చెప్పింది చేయడనే మోసాన్ని చాటుకున్నాడన్నారు. గత ఏడాది చంద్రబాబు పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి వచ్చిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ప్రజలపై కేసులు పెట్టడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. విద్య, వైద్య రంగాలతో పాటు వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుందని బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కక్ష సాధింపు చర్యలను పుస్తకం రూపంలో ప్రచురించారని, దానిని పార్టీ నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, మండల రూరల్ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యులు వేమా శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ గోపురపు రాజ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ రావి లక్ష్మయ్య, గంగిరెడ్డి ఓబుల్రెడ్డి, కౌన్సిలర్లు బీమన వెంకట్రావు, సోమా శేషాద్రి, గోపురపు చంద్ర, గంగిరెడ్డి ఓబుల్రెడ్డి, మక్కెన రాజేంద్ర, కూరాకుల సుబ్బారెడ్డి, కూడలి మాలకొండయ్య, గండి రోశయ్య, కుంచాల రాంబాబు, పెరికల నాగేశ్వరరావు, బొంతా సంతోష్, పొన్నపల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
పూర్తిగా క్షీణించిన శాంతిభద్రతలు పొదిలి ర్యాలీకి సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలు జగన్ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం కూటమి ఏడాది పాలనపై వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించిన బూచేపల్లి