
వైఎస్సార్ సీపీ కార్యకర్తకు ‘అన్నా’ పరామర్శ
మార్కాపురం టౌన్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 11న పొదిలిలో చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తల రాళ్లదాడిలో గాయపడిన మార్కాపురం మండలం గజ్జలకొండ పంచాయతీ పరిధిలోని పడమటిపల్లె గ్రామానికి చెందిన నారు తిరుపతిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు ఆదివారం పరామర్శించారు. ర్యాలీపై రాళ్లదాడి చేయడంతో గాయపడటం బాధాకరమని, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యుడు నారు బాపన్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ జి.శ్రీనివాసరెడ్డి, నాయకులు బట్టగిరి తిరుపతిరెడ్డి, చెంచిరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.