
చాలీ చాలని గదులు
కొండపి నియోజకవర్గంలోని పాఠశాలలకు పూర్తిస్థాయిలో విద్యా మిత్ర కిట్లు రాలేదు. పాఠశాలల్లో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్లు మూతపడ్డాయి. దీంతో విద్యార్థులు తాగునీటికి ఇబ్బంది పడ్డారు. నూతన విధానంలో ప్రాథమిక పాఠశాలలకు టీచర్ల సంఖ్య పెంచినా చాలాచోట్ల చాలినన్నీ గదులు లేవు. శానంపూడి ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేశారు. ఈ పాఠశాలలో నూతన విద్యా విధానం ప్రకారం ఒకటి నుంచి 10 తరగతులు నిర్వహిస్తారు. మొత్తం 10 గదులు కావాల్సి ఉండగా 7 గదులు మాత్రమే ఉండటంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పేలా లేవు. పాతసింగరాయకొండ ఉన్నత పాఠశాలలో కూడా అసంపూర్తిగా గదుల నిర్మాణం నిలిచిపోయాయి.