21న పొదిలిలో మద్యం దుకాణానికి డ్రా | - | Sakshi
Sakshi News home page

21న పొదిలిలో మద్యం దుకాణానికి డ్రా

Jun 14 2025 10:12 AM | Updated on Jun 14 2025 10:12 AM

21న పొదిలిలో మద్యం దుకాణానికి డ్రా

21న పొదిలిలో మద్యం దుకాణానికి డ్రా

ఒంగోలు టౌన్‌: పొదిలి పట్టణంలోని 1వ నంబరు మద్యం దుకాణానికి ఈ నెల 21వ తేదీ డ్రా తీయనున్నట్లు ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ షేక్‌ ఆయేషా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకుగాను 19వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్లో కానీ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తుదారులు జిల్లా ఎకై ్సజ్‌ కార్యాలయంలో నిర్వహించే డ్రాలో పాల్గొనాలని తెలిపారు.

తెనాలిలో పోలీసు హింసపై 14న విజయవాడలో సదస్సు

ఒంగోలు వన్‌టౌన్‌: తెనాలిలో దళిత, ముస్లిం యువకులపై తెనాలికి చెందిన ఇద్దరు పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌లు హింసాత్మకంగా దాడి చేసిన ఘటనపై ఈనెల 14న విజయవాడలో నీలం నాగేంద్రరావు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు మాల మహానాడు అధ్యక్షుడు దారా అంజయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులపై హత్యాయత్నం చేశారనే కట్టుకథతో ముగ్గురు దళిత, ముస్లిం యువకులపై గంజాయి బ్యాచ్‌గా ముద్ర వేసి తెనాలి, టూటౌన్‌ సీఐ రాముల నాయక్‌, త్రీటౌన్‌ సీఐ రమేష్‌ బాబులు తాలిబన్ల తరహాలో అనాగరికంగా, బహిరంగంగా కొట్టారన్నారు. దీనిని సమర్ధిస్తూ హోం మంత్రి మాట్లాడారన్నారు. యువకులపై తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ నాయకులు మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆదేశాలతోనే రౌడీషీట్లు నమోదు చేశారన్నారు. ఈ ఘటనపై శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ఈ సంఘటనపై సదస్సు జరుగుతుందని చెప్పారు.

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులు పరిశీలించిన ఢిల్లీ బృందం

దర్శి (కురిచేడు): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను గ్రామీణాభివృద్ధి శాఖ న్యూఢిల్లీ ప్రతినిధులు దిశ జాయింట్‌ డైరెక్టర్‌ ఉమేష్‌కుమార్‌ రామ్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌ జీఎస్‌ రావత్‌, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ జీ జోసఫ్‌ కుమార్‌ లు శుక్రవారం దర్శి మండలంలో పర్యటించారు. పలు పనులను వారు తనిఖీ చేశారు. వారు ఈ నెల 8 నుంచి 14 వరకు జిల్లాలో పలు మండలాల్లో వారు పనులను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం దర్శి మండలంలోని యర్ర ఓబనపల్లి పంచాయతీలో రైతు పంట కుంటను, హార్టీకల్చర్‌ ప్లాంటేషన్‌ బత్తాయి తోటను పరిశీలించారు. పంట కాలువ పూడికతీత పనిలో ఉపాధి కూలీలతో ముఖాముఖి అయి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే పశువుల షెడ్డు నిర్మాణం, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారుల గృహాలను పరిశీలించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు వారి ఆర్థిక ఆదాయ పెరుగుదల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎల్‌ కృష్ణమూర్తి, దర్శి క్లస్టర్‌ అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ లలితకుమారి, ఏపీఓ బీ మురళి, ఏపీఎం షేక్‌.రజియా సుల్తానా, ఏరియా కో ఆర్డినేటర్‌ లక్ష్మిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement