అయ్యోరు! | - | Sakshi
Sakshi News home page

అయ్యోరు!

Jun 14 2025 10:12 AM | Updated on Jun 14 2025 10:12 AM

అయ్యోరు!

అయ్యోరు!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. తొలుత ప్రధానోపాధ్యాయుల బదిలీల ప్రారంభంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆ తర్వాత సెకండరీ గ్రేడ్‌ టీచర్ల బదిలీలు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ కోసం ఆందోళన చేశారు. తాజాగా నిబంధనలకు విరుద్ధంగా అధికారులు బదిలీలు చేస్తున్నారంటూ పలు ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం పాఠశాలను కోరుకునేందుకు అవకాశం ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నాయి. ఖాళీ ఉన్నచోట తీసుకో అంటూ హుకుం జారీ చేస్తున్నారని, స్పౌజ్‌ ఆప్షన్‌ ఉన్నవారినీ ఇలానే బెదిరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒంగోలు సిటీ:

మ్మడి ప్రకాశం జిల్లాలో టీచర్ల బదిలీల ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. తొలుత ప్రధానోపాధ్యాయుల బదిలీలు గత నెల మే 21వ తేదీన ప్రారంభమయ్యాయి. తొలి రెండు రోజులు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. 141 మంది బదిలీలకు దరఖాస్తులు చేసుకున్నారు. తర్వాత సెకండరీ గ్రేడ్‌ టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. బదిలీలు వెబ్‌ కౌన్సెలింగ్‌ కాకుండా మాన్యువల్‌గా నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పిందంటూ రెండు రోజులు ఆందోళన చేశారు. ప్రభుత్వం కొన్ని మార్పులు చేయడంతో మంగళవారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రెండు ఉపాధ్యాయ సంఘాల మధ్య వివాదం తలెత్తడంతో బుధవారం నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. బదిలీలకు సంబంధించి ఎస్జీటీలు సుమారు 3148 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో స్పౌజ్‌ ఆప్షన్‌ కింద 515 మంది దరఖాస్తు చేసుకున్నారు. నగరంలోని పాత జెడ్పీ సమావేశ మందిరంలో బదిలీలను నిర్వహిస్తున్నారు. 11వ తేదీ తొలి 600 మందికి, 12వ తేదీ 601 నుంచి 1300 వరకూ, 14వ తేదీ 1301 నుంచి 1800 వరకూ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. స్పౌజ్‌ ఆప్షన్‌ కింద దరఖాస్తు చేసుకున్న 515 మందిలో 416 మందికి కౌన్సెలింగ్‌ పూర్తి చేశారు.

బదిలీల్లో ఇష్టారాజ్యం

సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల బదిలీల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా కౌన్సెలింగ్‌లో ఖాళీలు చూపించిన తర్వాత ఆ ఉపాధ్యాయుడు తనకు అనుకూలమైన స్థానాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్ల బదిలీల్లో అధికారులు అందుకు భిన్నంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి బదిలీలను పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులు ఉన్నా అవేమీ తమకు కాదన్నట్లుగా జిల్లా విద్యాశాఖాధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఉపాధ్యాయుడు బదిలీల కౌన్సెలింగ్‌ సమయంలో కంప్యూటర్‌ ద్వారా డీస్‌ప్లే చేస్తున్న ఖాళీలను పరిశీలించి తనకు ఇష్టమైన స్థానాన్ని ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ అందుకు భిన్నంగా బదిలీల కౌన్సెలింగ్‌లో సంబంధిత అధికారే తాను సూచించిన స్థానానికి వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికారుల తీరుపై ఉపాధ్యాయులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ పోరాడి సాధించుకున్నామన్న తృప్తి లేకుండా పోయిందని వాపోతున్నారు. ఏ శాఖలోనైనా ఉద్యోగుల బదిలీలు జరుగుతుంటే ఆ శాఖలో ఉన్న ఖాళీలను చూపించి ఆప్షన్లు పెట్టించుకుంటారు. కానీ ఉపాధ్యాయ బదిలీల్లో మాత్రం ఉపాధ్యాయులు ఆప్షన్లు పెట్టుకున్నా అవేమీ చెల్లుబాటు కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాము పారదర్శకంగా బదిలీలు చేస్తున్నామని పైకి చెబుతున్నా అంతర్గతంగా ఏదో మతలబు ఉందనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది నిర్వహించిన రేషనలైజేషన్లో ఉపాధ్యాయులు సుదూర ప్రాంతాలకు బదిలీపై వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత బదిలీల్లో అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఉపాధ్యాయులు ఒకే చోట పనిచేసేందుకు పిల్లలు ఎక్కువ మంది ఉన్న పాఠశాలలను గుర్తించి ఆప్షన్లు పెట్టుకున్నారు. దరఖాస్తు చేసుకున్న ఆప్షన్లకు భిన్నంగా ఫలానా మండలంలో ఫలానా పాఠశాలలో ఖాళీగా ఉంది. అక్కడకు వెళ్లండి అంటూ బహిరంగంగా చెప్తుండటంతో ఉపాధ్యాయులు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక ఎత్తు అయితే మరో వైపు స్పౌజ్‌, అనారోగ్య కారణాలు, దీర్ఘకాలిక వ్యాధులు, వివిధ కేటగిరీల్లోని ఉపాధ్యాయుల పరిస్థితి కూడా ఇదే విధంగా మారింది. కొంత మంది ఉపాధ్యాయులు స్పౌజ్‌ కేటగిరీలో తమకు అనుకూలమైన పాఠశాలలను ఎంపిక చేసుకోకుండా అధికారులే స్థానాలు కేటాయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమకు అనుకూలమైన ప్రాంతాల్లోని పాఠశాలను ఎంపిక చేసుకోకుండా అధికారులు కేటాయించిన స్థానాల్లో తాము చేరితే భవిష్యత్‌లో ఆ పాఠశాలలకు రేషనలైజేషన్లో పోస్టులు పోతే తమ పరిస్థితి ఏమిటని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఒక మహిళా టీచర్‌ అనారోగ్యరీత్యా తనకు అనుకూలమైన స్థానాన్ని కోరుకుంటే అవేమీ పట్టించుకోకుండా పక్క జిల్లాకు వెళ్లాలని అంటున్నారని, ఈ బదిలీలు ఎంత పారదర్శకంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చంటున్నారు.

పోస్టింగ్‌ ఇచ్చాం.. వెళ్లండి

ఎస్జీటీల బదిలీల్లో నిబంధనలకు తూచ్‌ ఏక పక్షంగా వ్యవహరిస్తున్న అధికారులు బదిలీలకు 3148 మంది దరఖాస్తు ఉపాధ్యాయులకు ఆప్షన్‌ ఇవ్వని అధికారులు స్పౌజ్‌ ఆప్షన్‌ ఉన్నవారికీ అన్యాయం అంటూ ఆరోపణలు ఇప్పటి వరకూ 1800 వరకూ కౌన్సెలింగ్‌ అధికారుల తీరుపై మండిపడుతున్న యూనియన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement