
రక్షిత నీరుకు దిక్కేది...?
గిద్దలూరు నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో మినరల్ వాటర్ప్లాంట్లు మరమ్మతులకు గురయ్యాయి. బేస్తవారిపేటలోని జెడ్పీ బాలికల హైస్కూల్, కంభంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్వో ప్లాంట్లు మరమ్మతులకు గురై నెలలు గడుస్తున్నా స్పందన లేదు. బేస్తవారిపేట మండలంలో నాడు–నేడు రెండో విడత కింద 20 పాఠశాలల్లో చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. రాచర్ల మండలంలోని ఆకవీడు యూపీ పాఠశాలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, బూట్లు, యూనిఫాం, బెల్ట్ తదితర సామగ్రితో కూడిన విద్యామిత్ర కిట్లు పాఠశాలలకు విద్యార్థుల సంఖ్యకు సరిపడా సరఫరా చేయలేదు. డైస్ రోల్ ప్రకారం పంపిణీ చేయడంతో కొత్తగా చేరిన విద్యార్థులకు కిట్లు అందలేదు.