వైభవంగా మదనవేణుగోపాలుని రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా మదనవేణుగోపాలుని రథోత్సవం

Jun 12 2025 2:50 AM | Updated on Jun 12 2025 10:59 AM

వైభవం

వైభవంగా మదనవేణుగోపాలుని రథోత్సవం

పామూరు: మదన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రుక్విణి, సత్యభామా సమేత మదనవేణుగోపాలస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. రథోత్సవాన్ని ఎండోమెంట్‌ డీసీ పి.శ్రీనివాసరెడ్డి, ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబు, ఎంపీపీ గంగసాని లక్ష్మి, పువ్వాడి వెంకటేశ్వర్లు, రెడ్డిసంక్షేమసంఘం నాయకులు బైరెడ్డి జయరామిరెడ్డి, బోయళ్ల నారాయణరెడ్డిలు ప్రారంభించారు. రతోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కళారాలు, కేర ళ వాయిద్యాలు, కోలాటం, భజన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సీఐ ఎం భీమానాయక్‌ ఆద్వర్యంలో ఎస్సైలు పామూరు టి.కిషోర్‌బాబు, సీఎస్‌పురం ఎం వెంకటేశ్వరనాయక్‌, వెలిగండ్ల క్రిష్ణపావని, సిబ్బంది ప్రత్యేక భద్రతా ఏర్పాట్లుచేశారు. పామూరులో మొట్టమొదటిసారిగా రథోత్సవం నిర్వహించడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement