ఉపాధి పనులు తనిఖీ చేసిన కేంద్ర బృందం | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనులు తనిఖీ చేసిన కేంద్ర బృందం

Jun 13 2025 7:13 AM | Updated on Jun 13 2025 7:13 AM

ఉపాధి

ఉపాధి పనులు తనిఖీ చేసిన కేంద్ర బృందం

బేస్తవారిపేట: మండలంలోని బసినేపల్లె, గలిజేరుగుళ్ల గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులను జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతినిధులు ఉమేష్‌కుమార్‌రామ్‌, జీఎస్‌ రావత్‌ బృందం గురువారం క్షేత్ర పర్యటన చేశారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో చేపట్టిన ఉద్యానవన పంటలు, ఫారంపాండ్స్‌, పశువుల షెడ్లు, ట్రెంచ్‌లు, కమ్యూనిటీ ఫాండ్స్‌, నీటితొట్లు, హౌసింగ్‌ పథకంలో నిర్మించిన గృహాలను పరిశీలించారు. రోజువారి కూలి ఎంత పడుతుంది, ప్రతిరోజు పని పెడుతున్నారా అనే వివరాలను కూలీలతో మాట్లాడి తెలుసుకున్నారు. హౌసింగ్‌ పథకంలో బిల్లులు వచ్చాయా, లేదా అనే వివరాలను లబ్ధిదారులతో మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌ షణ్ముఖ్‌, డ్వామా పీడీ జి.జోసఫ్‌కుమార్‌, ఏపీడీ భాస్కరరావు, ఎంపీడీఓ ఏవీ రంగనాయకులు, ఏపీఓ గురువరకుమార్‌, ఈసీలు పాల్గొన్నారు.

గర్భిణులు ఆర్‌ఎంపీలను సంప్రదించొద్దు

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటేశ్వర్లు

ఒంగోలు టౌన్‌: గర్భిణులు ఆర్‌ఎంపీలు, నాటువైద్యులను సంప్రదించవద్దని, అర్హులైన వైద్యులనే సంప్రదించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లు సూచించారు. డీఎంహెచ్‌ఓ చాంబర్‌లో గురువారం పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌ జిల్లా స్థాయి సలహా సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌ఎంపీలు గర్భిణుల కోసం స్కానింగ్‌ పరీక్షలు రాయడం చట్టపరంగా శిక్షార్హం అవుతుందన్నారు. ఎవరైనా ఆర్‌ఎంపీలు, నాటు వైద్యులు గర్భణులకు వైద్యం చేసినా, స్కానింగ్‌ రెఫర్‌ చేసినా వారి వివరాలను వెంటనే జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారికి రాత పూర్వకంగా గానీ, స్వయంగా గానీ ఫిర్యాదు చేయాలన్నారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, ఏరియా వైద్యశాల, ప్రభుత్వ సర్వజన వైద్యశాలల్లో స్కానింగ్‌లు ఉచితంగా చేస్తారన్నారు. గడువు తేదీలు ముగిసి ఉన్న స్కానింగ్‌ సెంటర్లు వెంటనే రెన్యూవల్‌, రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్కానింగ్‌ సెంటర్లు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు చేయరాదని స్పష్టం చేశారు. ఎవరైనా స్కానింగ్‌ సెంటర్లు లింగ నిర్ధారణ పరీక్షల గురించి వాణిజ్య ప్రకటనలు ఇస్తే చట్టం ప్రకారం తగిన కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ సూరిబాబు, సర్వజన ఆసుపత్రి ప్రసూతి విభాగం అధిపతి సంధ్యారాణి, సర్వజన ఆసుపత్రి చిన్నపిల్లల విభాగాధిపతి తిరుపతి రెడ్డి, ఐఅండ్‌పీఆర్‌ ప్రతినిధి వేణుగోపాల్‌, ఎన్జీఓ లక్ష్మి, పద్మజ, సౌజన్య, వాణిశ్రీ, శ్రీవాణి, శ్రవణ్‌ కుమార్‌, మాస్‌ మీడియా అధికారి డి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి పనులు తనిఖీ చేసిన కేంద్ర బృందం 
1
1/1

ఉపాధి పనులు తనిఖీ చేసిన కేంద్ర బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement