
ముక్కిన బియ్యం.. మురిగిన గుడ్లు
మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం నిర్వహణలో డొల్లతనం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ పరిశీలనలో బట్టబయలైన సంఘటన ఇది. హాస్టల్లో విద్యార్థులకు పెడుతున్న అన్నంలో పురుగులు వస్తున్నాయని, నాణ్యత లేదని సబ్ కలెక్టర్కు ఫిర్యాదు అందడంతో మార్చి 17వ తేదీ రాత్రి బాలికల హాస్టల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్లో నాసిరకంగా ఉన్న కూరగాయలు, బియ్యం, మురిగిన కోడిగుడ్లను పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలకూ ఇలాగే అన్నం పెడతారా అంటూ తీవ్ర స్వరంతో మందలించారు.

ముక్కిన బియ్యం.. మురిగిన గుడ్లు