నేటి నుంచి కిట్లు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కిట్లు పంపిణీ

Published Thu, Jun 13 2024 12:48 AM | Last Updated on Thu, Jun 13 2024 12:48 AM

-

విద్యార్థులకు వచ్చిన కిట్లను గురువారం నుంచే పంపిణీ చేస్తాం. అందులో భాగంగానే పాఠశాలలకు కిట్లు పంపేందుకు అవసరమైన చర్యను ఒంగోలు మండలం నుంచి ప్రారంభించాం. కిట్‌ సర్దేందుకు రూ.3, రవాణా ఛార్జీలు రూ.11 కూడా విడుదలయ్యాయి. వాటికి సంబంధించి కలెక్టర్‌ ద్వారా ఉత్తర్వులు పొంది మండల కేంద్రాలకు నిధులు జమచేస్తాం. రాగిజావ, బియ్యం, గుడ్లు, చిక్కీలు వంటివన్నీ కూడా పాఠశాలలకు చేరుతున్నాయి. మధ్యాహ్న భోజనాన్ని తొలిరోజు నుంచే విద్యార్థులకు అందించేందుకు ఆదేశాలు జారీ చేశాం. గత ఏడాది పదో తరగతిలో మంచి మార్కులు వచ్చిన దృష్ట్యా ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య మరింతగా పెరుగుతుందని ఆశిస్తున్నాం. బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి. ఇందుకు సీఆర్‌పీలు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, పాఠశాలల హెడ్మాస్టర్లు బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క చిన్నారి బడిలో చేరేలా చర్యలు చేపడుతున్నాం.

– డి.సుభద్ర, జిల్లా విద్యాశాఖ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement