బాలుడు బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

బాలుడు బలవన్మరణం

Published Thu, Jun 13 2024 12:34 AM | Last Updated on Thu, Jun 13 2024 12:44 AM

బాలుడు బలవన్మరణం

ఒంగోలు టౌన్‌: పదిహేనేళ్ల బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సాయంత్రం ఒంగోలులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని నెహ్రూ నగర్‌లో నివాసం ఉండే దార్ల వెంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు శ్రీకాంత్‌ (15) ను చిన్నప్పుడు పెంపకానికి ఇచ్చారు. ఆ తరవాత తిరిగి తెచ్చుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి షెడ్డుకు ఉన్న ఇనుప రాడ్డుకు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌ కు తరలించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement