చంద్రబాబు దుర్మార్గ పాలనకు బలం మీడియానే: పొన్నవోలు | YSRCP Legal Cell Secretary Ponnavolu Slams Chandrababu Over Jungle Raj | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దుర్మార్గ పాలనకు బలం మీడియానే: పొన్నవోలు

May 9 2026 12:22 PM | Updated on May 9 2026 4:51 PM

YSRCP Legal Cell Secretary Ponnavolu Slams Chandrababu Over Jungle Raj

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితి రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ లీగల్‌ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై శనివారం గుంటూరు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొన్నవోలు మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. పోలీస్‌ రాజ్‌ మాత్రమే నడుస్తోంది.  కూటమి పాలనలో పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యమైంది. అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారు. సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.  

ప్రజా సమస్యలను గాలికొదిలేసి చంద్రబాబు నియంత పాలన చేస్తున్నారు.  చంద్రబాబు బలం మీడియానే. మీడియాను అడ్డుపెట్టుకుని అరాచక పాలన కొనసాగిస్తున్నారు అని పొన్నవోలు మండిపడ్డారు.

కూటమి అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తే జైళ్లకు పంపుతున్నారు

Advertisement
 
Advertisement
Advertisement