స్కిల్‌ స్కామ్‌ నిజమన్నది టీడీపీకి తెలుసు | TDP knows that skill scam is real says vijaya sai reddy | Sakshi
Sakshi News home page

స్కిల్‌ స్కామ్‌ నిజమన్నది టీడీపీకి తెలుసు

Sep 24 2023 3:58 AM | Updated on Sep 24 2023 4:00 PM

TDP knows that skill scam is real says vijaya sai reddy  - Sakshi

సాక్షి, అమరావతి: స్కిల్‌ కుంభకోణం నిజమన్నది తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసని, అందుకే అసెం­బ్లీలో చర్చ జరిగితే నిజాలు బయటపడతా­యని కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్‌­సీపీపీ నేత, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి శనివారం ఒక ప్రకటన­లో చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమే­నని, ఎవ్వరికీ మినహాయింపులు ఉండవని అన్నారు. 74 ఏళ్ల వృద్ధుడిని ఎలా అరెస్ట్‌ చేస్తారని, ప్రభుత్వంలో ఏదో జరిగితే ఆయనకేం సంబంధమనే వింత వాదనలతో కొందరు న్యాయ­స్థానం నిర్ణయాన్ని తప్పుబట్టే సాహసం చేస్తున్నా­రని మండిపడ్డారు.

ఏ నేరం చేయకపోతే నిర్దోషిగా బయటి­కొస్తారు కదా అని అన్నారు. చంద్రబాబు కేసును తప్పుదోవ పట్టించబోయి మరింత జటిలం చేసుకు­న్నారని చెప్పారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే సీఐడీ కోర్టు రిమాండు విధించిందన్న విషయాన్ని లెక్క చేయకుండా మెయింటెయినబుల్‌ కాని క్వాష్‌ పిటిషన్‌తో హై­కోర్టులో అక్షిం­తలు వేయించుకు­న్నా­రని తెలిపారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో దోమల బెడద లేదని, లార్వా ఆనవాళ్లే లేవని స్వయంగా జైళ్ల డీఐజీనే చెప్పారని తెలిపారు. బహుశా చంద్రబాబు సీఎంగా ఉండగా దోమలపై దండయాత్ర పేరుతో నిధులు మింగేశారన్న కోపంతో దోమలే బయట నుంచి వచ్చి కుట్టేసి పోతున్నాయేమోనని వ్యాఖ్యా­నించారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి బెయిల్‌ పిటిషన్‌ రద్దయితే లోపలకు వెళ్లి ఇద్దరూ కలిసి జైలులో దోమలపై దండయా­త్రలు కొనసాగించవచ్చని ఎద్దే­వా చేశారు. సీమెన్స్‌ కంపెనీ ఒప్పందం ప్రకా­రం పెట్టు­బడి ఎందుకు పెట్టలేదని, ఏ కార్యకలా­పాలూ నిర్వ­హించక­పోయినా నిధులెందుకు విడు­దల చేశారని ఎల్లో మీడియా చంద్రబాబునే అడగా­లన్నారు. వైఎస్సార్‌­సీపీ ప్రభు­త్వం ఎక్కడా అవి­నీతికి తావు లేకుండా పని చేస్తోంద­న్నారు. ఎక్కడ అవకతవ­కలు జరిగినట్లు తెలిసినా, ఏమాత్రం నిర్లక్ష్యం చూప­కు­ండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పా­రు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement