AP Former Minister Perni Nani Comments On Chandrababu Naidu, Details Inside - Sakshi
Sakshi News home page

చంద్రబాబును మించిన సైకో ఎవరున్నారు?: పేర్ని నాని

Apr 13 2023 1:56 PM | Updated on Apr 13 2023 4:49 PM

Perni Nani Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: నమ్మకానికి సీఎం జగన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అయితే.. వెన్నుపోటుకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అని మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 2014లో చంద్రబాబు ఇచ్చిన ఒక్కహామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.

‘‘ఔటర్‌ రింగ్‌రోడ్డు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అన్నావ్‌.. తెచ్చావా?. బందరును హైదరాబాద్‌ మించిన సిటీ చేస్తానన్నావ్‌ చేశావా?. బందరులో పర్యటించే అర్హత చంద్రబాబుకు లేదు’’ అని పేర్ని నాని మండిపడ్డారు. త్వరలో సీఎం జగన్‌ బందరు పోర్టు పనులు ప్రారంభిస్తారని, శరవేగంగా బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన అన్నారు.

‘‘చంద్రబాబు లాంటి పచ్చి రాజకీయ మోసగాడు ఎవరూ లేరు. నీరు-చెట్టు పథకంలో చంద్రబాబు రూ.2వేల కోట్లు కొట్టేశారు. జన్మభూమి కమిటీల పేరుతో పచ్చచొక్కాలకు దోచిపెట్టారు. చంద్రబాబు మళ్లీ తన పాలన తెస్తానని ప్రజలకు చెప్పగలరా?. జన్మభూమి కమిటీలను మళ్లీ ప్రవేశపెట్టగలరా?. తాను చేసిన ఒక్క మంచిపనైనా చెప్పగలరా?. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబును మించిన సైకో ఎవరున్నారు?. పిల్లనిచ్చిన మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.. బామ్మర్ధిలను తడిగుడ్డలతో గొంతకోసిన వాడు సైకో కాదా?’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.
చదవండి: రిచెస్ట్‌ పొలిటీషియన్‌ చంద్రబాబు.. ఏడీఆర్‌ నివేదికలో అసలు వాస్తవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement