ఆయన ఒక చక్రవర్తిలా కలగన్నాడు | Minister Venu Gopala Krishna Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

స్టేలు తెచ్చుకుంటే మీరు నిరపరాధి కాదు

Aug 5 2020 12:52 PM | Updated on Aug 5 2020 3:14 PM

Minister Venu Gopala Krishna Comments On Chandrababu Naidu - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: విభజన చట్టంలో పొందుపరిచిన ఏ అంశాన్ని చంద్రబాబునాయుడు పూర్తి చేయలేదని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శివరామకృష్ణ కమిటీని కనీసం పట్టించుకోలేదు. ఆయన ఒక చక్రవర్తిలా కలగన్నాడు. రాజధానిలో ఐదు సంవత్సరాల కాలంలో ఏ నిర్మాణం చేశాడు..?. కపట నాటకానికి, కుట్రపూరిత రాజకీయానికి తెరతీశాడు. సుమారు రెండు వేల ఎకరాల భూమిని అమ్ముకున్నాడు కానీ ఏ ఒక్క రైతుకు ప్రయోజనం కలగలేదు. (గుడివాడలో 'హౌస్‌ ఫర్‌ ఆల్'‌ పథకం ప్రారంభం)

మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ఈ రాష్ట్రంలో అడుగులు వేస్తున్న నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. జగన్‌పై ఆరోపణలు చేశారు. అందులో ఏమాత్రం తప్పులేదు కనుకే విచారణ ఎదుర్కొన్నారు. కానీ మీ మీద ఆరోపణ వస్తే 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు. స్టేలు తెచ్చుకుంటే మీరు నిరపరాధి కాదు. అమరావతి భూముల్లో మీరు చేసిన స్కామ్‌లు సీబీఐ ఎంక్వయిరీలో అన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా వాటిని అనుభవించాలి. అనుభవించే రోజులు వస్తాయి. న్యాయస్థానాన్ని మభ్యపెట్టి, మేనేజ్ చేసి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం కోసం చేసే ప్రయత్నం ప్రజాస్వామ్యవాదులు క్షమించరంటూ చంద్రబాబుపై మంత్రి చెల్లుబోయిన తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు.  (సీఐ సస్పెన్షన్‌పై టీడీపీ విషప్రచారం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement