AP: Minister Gudivada Amarnath Comments On Chandrababu And Pawan Kalyan - Sakshi
Sakshi News home page

Gudivada Amarnath: ‘సొంత పుత్రుడు పనికి రాడని.. దత్త పుత్రుడి వెంట బాబు’

Apr 24 2022 12:48 PM | Updated on Apr 24 2022 1:59 PM

Minister Gudivada Amarnath Comments On Chandrababu And Pawan Kalyan - Sakshi

చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ జనసేన అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు.

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ జనసేన అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసేనకు సిద్ధాంతాలు లేవు.. చంద్రబాబు కోసమే పనిచేస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబు దత్త పుత్రుడు.. వైఎస్‌ జగన్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు  విడ్డూరంగా వున్నాయి. కౌలు రైతుల కష్టాలకు చంద్రబాబు కారణమని దత్త పుత్రుడు తెలుసుకోవాలని మంత్రి హితవు పలికారు.
చదవండి👉: జగన్‌ మానియాను చూసి పవన్‌కు మతిపోయింది 

‘‘2014లో అధికారంలో రావడానికి చంద్రబాబు కౌలు రైతులను మోసగించారు. కౌలు రైతుల మరణాలకు చంద్రబాబు కారణం. రైతుల మరణాలపై కేసులు కూడా నమోదు చెయొద్దని చంద్రబాబు ఆ రోజుల్లో ఆదేశాలు కూడా ఇచ్చారు. పవన్ అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు. రైతుల రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేయలేదా ?. ఎన్టీఆర్‌ను వెన్ను పోటు పొడిచి.. ఆయన మరణానంతరం ఆయన ఫోటోకు దండలు వేసే నైజం చంద్రబాబుది.

రైతులను మోసగించిన చంద్రబాబును ప్రశ్నించకుండా జగన్ ప్రభుత్వాన్ని పవన్ విమర్శిస్తున్నారు. ప్రతీ కౌలు రైతుకు పరిహారం సీఎం జగన్‌ అందిస్తున్నారు. ఎన్నికల హామీలను అమలు చేయని వ్యక్తి చంద్రబాబు. బహు భార్యలతో విలువలు లేని వ్యక్తి పవన్. ఈ మాటలు నేను చెప్పింది కాదు.. పవన్ రెండో భార్య రేణు దేశాయ్ చెప్పిందే. లోకల్‌, నేషనల్, ఇంటర్నేషనల్ భార్యలు వున్న వ్యక్తి పవన్.. సీఎం జగన్‌ని విమర్శించడం దారుణం.
చదవండి👉: లాడ్జి వివాదం: రామయ్యా.. ఇదేంటయ్యా? 

కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయి సీఎం జగన్‌పై కుట్రలు చేశారని ప్రజలకు తెలుసు. ఆ కుట్రలు తెలిసే 2019లో జనం ఓడించారు. చంద్రబాబు సొంత పుత్రుడు పనికి రాడని.. దత్త పుత్రుడు వెంట పడుతున్నారని’’ మంత్రి అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement