సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రులు లైట్ తీసుకున్నారా? అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. కేబినెట్ సమావేశాన్ని మంత్రులు లైట్ తీసుకోవడంతో చంద్రబాబు సీరియస్ అయినట్టు సమాచారం. దీంతో, వారిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
వివరాల ప్రకారం.. సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశాన్ని మంత్రులు కూడా లెక్క చేయడం లేదు. కేబినెట్ సమావేశానికి మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, సంధ్యారాణి, సుభాష్లు ఆలస్యంగా హాజరయ్యారు. ఈ క్రమంలో మంత్రులు ఆలస్యంగా రావడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. దీంతో, మంత్రులు అయి ఉండి.. మీరే సమయ పాలన పాటించకపోతే ఎలా? అని ప్రశ్నించినట్టు సమాచారం. కీలక కేబినెట్ సమావేశానికి కూడా మంత్రులు ఆలస్యంగా రావడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.


