బండి చేస్తోంది విష ప్రచార యాత్ర 

CLP leader Mallu Bhatti Vikramarka Allegation On Bandi Sanjay - Sakshi

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

మునుగోడు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్నది ప్రజా సంగ్రామ పాదయాత్ర కాదని, విషప్రచార యాత్ర చేస్తూ రాష్ట్రంలో మతకలహాలు రెచ్చగొడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా మునుగోడులో విలేకరులతో మాట్లాడారు. సంజయ్‌ అబద్ధాలు ఆడటంలో దిట్ట అని, ఆయన కు వచ్చినన్ని అబద్ధాలు మరే నాయకుడికి రావని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచి పెడుతోందని ఆరోపించారు. ఎనిమిదేళ్ల క్రి తం అదానీ ఆస్తులు రూ.50 వేల కోట్లు ఉంటే ఇ ప్పుడు రూ.11 లక్షల కోట్లు దాటాయన్నారు.

పె ట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని మోదీ ప్రభుత్వా న్ని గద్దె దింపితేనే అవి తగ్గుతాయని అన్నారు. నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కరువయ్యాయన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘ నత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. పేద ప్రజల కు మేలు కలగాలంటే కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లువేసి గెలిపించాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలిచిన పాల్వాయి స్రవంతిని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో ము లుగు ఎమ్మెల్యే సీతక్క, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top