
కొనుగోలు కేంద్రాలకు బీఆర్ఎస్ కేడర్ వెళ్లాలి
మాజీ మంత్రి హరీశ్రావు సూచన
సిద్దిపేట జోన్: ఆరుగాలం పండించిన రైతు ధాన్యా నికి మద్దతు ధర అందేలా, చివరి గింజ వరకు కొనేలా అన్నదాతలకు బీఆర్ఎస్ శ్రేణులు అండగా ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. ఆయన సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సమస్యలు, సర్కారు వైఫల్యం, పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుతం అకాల వర్షాలతో అతలాకుతల మవుతున్న రైతులకు కష్టకాలంలో అండగా ఉండి మనోధైర్యం చెప్పాలని కోరారు. రోజుకో మాటతో రైతులను మోసగిస్తున్న ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్నారు. రూ.500 బోనస్ ఇచ్చే వరకు పోరాడుదామన్నారు. నియోజకవర్గ పరిధిలో ఆయా కొనుగోలు కేంద్రాలను రోజూ పార్టీ ప్రజాప్ర తినిధులు, ముఖ్య నాయకులు సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోవాలని, వాటి పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
మిల్లర్లు, రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులను సమన్వయం చేసుకొని ధాన్యం కొనేలా చూడాల న్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలిగినా తన దృష్టికి తీసుకురావాలని హరీశ్రావు సూచించారు.