అభివృద్ధి.. ఆలస్యం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి.. ఆలస్యం

Jan 8 2026 6:27 AM | Updated on Jan 8 2026 6:27 AM

అభివృ

అభివృద్ధి.. ఆలస్యం

● అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన మంథనిలో సామాజిక వైద్యశాలను వంద పడకలకు అప్‌గ్రేడ్‌ చేసేందుకు తొలుత 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి గతేడాది జూన్‌ 28న శంకుస్థాపన చేశారు. పనులు ఇంకా మందకోడిగానే సాగుతున్నాయి. ● మంథని మండలం అడవిసోమన్‌పల్లిలో యంగ్‌ ఇండియా సమీకృత విద్యాసంస్థల ద్వారా రూ.200 కోట్లతో చేపట్టే భవన నిర్మాణానికి 2024 అక్టోబర్‌ 11న శంకుస్థాపన చేశారు. పనులు ఇంకా ప్రారంభించనేలేదు. ● జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం బీరాసాగర్‌ వద్ద నిర్మాణంలో ఉన్న మినీకాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కోసం 2024 డిసెంబర్‌లో రూ.571 కోట్లు కేటాయించినా.. పనులు ఇంకా పూర్తికాలేదు. ● మంథనిలోని పాత రెవెన్యూ కార్యాలయాల స్థలంలో రూ.4.5 కోట్లతో చేపట్టే సమీకృత భవన సముదాయాల నిర్మాణానికి గతేడాది మార్చి 29న శంకుస్థాపన చేశారు. వారం క్రిత మే పాతభవనాల కూల్చివేత ప్రారంభమైంది.

మంథని: రాష్ట్రంలోని సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో మంథని పట్టణాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. ని యోజకవర్గ రూపరేఖలు మార్చేలా మంథని అభి వృద్ధి నిధులు వరదలా మంజూరవుతున్నాయి. కానీ, ఏడాదిన్నర గడిచినా పనుల్లో ప్రగతి కనిపించడం లేదు. వివిధ శాఖల అధికారుల ఆలసత్వ మో, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమో తెలియదు కానీ.. ప్రగతి పనులు ఇంకా ముందుకు సాగడమే లేదు.

ప్రారంభంకాని పనులు..

మంథని సమీపంలోని గోదావరి నదిపై మంచిర్యాల జిల్లా శివ్వారం వరకు రూ.125 కోట్ల అంచనాలతో హైలెవల్‌ వంతెన నిర్మాణానికి 2024 డిసెంబర్‌లో జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి సభ ప్రాంగణంలోనే శంకుస్థాపన చేసారు. అనుమతులు, పరీక్షల పేరిట కాలయాపన జరుగుతోంది. దీంతో పనులు ప్రారంభమే కాలేదు. వంతెనకు అనుసంధానంగా మంథని శివారులో రూ.165 కో ట్ల అంచనాలతో చేపట్టే శ్రీపాదమార్గ్‌(బైపాస్‌ రో డ్డు)కు అవసరమైన భూసేకరణ కోసం 15 రోజుల క్రితమే నోటీస్‌లు జారీచేశారు.

తరచూ సమీక్షిస్తున్నా..

అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలని మంత్రి డి.శ్రీధర్‌బాబుతో జిల్లాస్థాయి అధికారులు పలుమార్లు సమీక్షిస్తున్నారు. కలెక్టర్‌ పలుమార్లు పర్యవేక్షిస్తున్నా ఆశించినస్థాయిలో అభివృద్ధి పనులు సాగడం లేదనే విమర్శలు ఉన్నాయి.

అనుమతుల్లో ఆలస్యం

మంథని ప్రాంతానికి మంజూరైన అభివృద్ధి పనులకు అటవీ, పర్యావరణ అనుమతులు సకాలంలో రావడంలేదు. భూ సేకరణలోనూ ఆలస్యం అవుతోంది. విడతల వారీగా వస్తున్న అనుమతుల ఆధారంగా పనులు చేపడుతున్నాం. అందుకే ఆలస్యమవుతోంది.

– జఫార్‌, డీఈఈ, ఆర్‌ అండ్‌ బీ, మంథని

ఏడాది గడిచినా ప్రారంభంకాని పనులు రూ.కోట్లు మంజూరైనా తప్పని అవస్థలు

అధికారులు, కాంట్రాక్టర్ల తీరుపై ప్రజల ఆగ్రహం మంథనిలో ప్రగతి పనుల తీరు

అమృత్‌ 2.0 ప్యాకేజీ–1 ద్వారా రూ.12.10 కోట్ల అంచనాలతో మంథనిలోని పోచమ్మవాడలో చేపట్టిన వాటర్‌ ట్యాంక్‌ పనులకు 2024 జూలై 15న శంకుస్థాపన చేశారు. ఆర్నెల్లలో పనులు పూర్తిచేసి పురవాసులకు తాగునీరు సరఫరా చేస్తామని అప్పట్లోనే చెప్పారు. ఏడాదిన్నర కావొస్తున్నా పనులు పునాదులు దాటడంలేదు.

అభివృద్ధి.. ఆలస్యం1
1/3

అభివృద్ధి.. ఆలస్యం

అభివృద్ధి.. ఆలస్యం2
2/3

అభివృద్ధి.. ఆలస్యం

అభివృద్ధి.. ఆలస్యం3
3/3

అభివృద్ధి.. ఆలస్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement