ఘనంగా జగన్నాథ రథయాత్ర | - | Sakshi
Sakshi News home page

ఘనంగా జగన్నాథ రథయాత్ర

Jun 28 2025 5:51 AM | Updated on Jun 28 2025 7:23 AM

ఘనంగా

ఘనంగా జగన్నాథ రథయాత్ర

జ్యోతినగర్‌(రామగుండం): ఎన్టీపీసీ పీటీఎస్‌ లో శుక్రవారం జగన్నాథస్వామి రథయాత్ర సందడి మొదలైంది. వైకుంఠపురంలోని జగన్నాథుని ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌కుమార్‌ సామంత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జగన్నాథునిడి రథంలో పీటీఎస్‌ వీధులలో కో లాట బృందాల నృత్యాలతో ఊరేగించారు. ఆలయ అర్చకులు రామాచార్యులు, ఎన్టీపీసీ ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి రాజేశ్వర్‌, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం

పెద్దపల్లిరూరల్‌: గర్భస్థ శిశువు లింగనిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు పా టించని స్కానింగ్‌ కేంద్రాలపై చర్యలు తప్ప వని జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నకుమారి హెచ్చరించారు. శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. లింగ నిర్ధారణ చేసినా, చేయించుకున్న వారికీ మూడే ళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తామన్నా రు. జిల్లాలో 32 స్కానింగ్‌ కేంద్రాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ జి ల్లా అధ్యక్షుడు రాజగోపాల్‌తో పాటు వాణిశ్రీ, స్రవంతి, శ్రీదేవి, స్నేహ పాల్గొన్నారు.

సీఈగా బాధ్యతలు స్వీకరణ

పెద్దపల్లిరూరల్‌: ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈగా పనిచేస్తున్న కంకటి మాధవరావుకు వరంగల్‌ జోన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ (సీఈ)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సీఈగా బాధ్యతలు చేపట్టిన మాధవరావును జిల్లాకు చెందిన విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది శుక్రవారం పూలమాల, శాలువాతో సత్కరించారు.

బల్దియా ఇంజినీర్‌పై ఫిర్యాదు

కోల్‌సిటీ(రామగుండం): అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బల్దియా ఈఈ పీవీ రామన్‌పై చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. టెండర్ల ప్రక్రియను పారద్శకంగా నిర్వహించడం లేదని, స్థానికులను కాద ని స్థానికేతర కాంట్రాక్టర్లకు నామినేషన్‌ పద్ధతి న పనులు అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. ఇత ర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బ్లీచింగ్‌ పౌడర్‌ కొనుగోలుకు టెండర్లు పిలిస్తే రామగుండంలో నామినేషన్‌ పద్ధతిలో అప్పగించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. చెట్లు కట్‌ చే యడం, ట్రీగార్డ్స్‌ సరఫరా చేయడానికి కూడా ఇలాంటి పద్ధతులు అమలు చేస్తున్నారన్నారు. స్థానిక కాంట్రాక్టర్లకు పనులు దక్కకుండా వ్యవ హరిస్తున్న ఈఈపై చర్యలు తీసుకోవాలని ఫి ర్యాదు చేసినట్లు కాంట్రాక్టర్లు తెలిపారు. దీనిపై ఈఈ రామన్‌ను వివరణ కోరగా, కాంట్రాక్టర్లు చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. అన్ని ప నులను టెండర్ల ద్వారానే అప్పగిస్తున్నామని తెలిపారు. బ్లీచింగ్‌ పౌడర్‌ సరఫరాను కలెక్టర్‌ అప్రోవల్‌తోనే అప్పగించామని వెల్లడించారు.

రేపు జిల్లాస్థాయి పోటీలు

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల 29వ తేదీన జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహిస్తామని అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కొలిపాక శ్రీనివాస్‌, కొమ్మ గట్టయ్య తెలిపారు. ప్రతిభ కనబర్చిన 20మందిన వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి గలవారు వయసు ధ్రువీకరణపత్రం, ఆధార్‌కార్డుతో అదేరోజు ఉదయం ప్ర భుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో హాజరు కావాలని కోరారు. వివరాల కోసం 96183 36976 నంబరులో సంప్రదించాలన్నారు.

3, 4వ తేదీల్లో కాలేజీల బంద్‌

పెద్దపల్లిరూరల్‌: విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలనే డి మాండ్‌తో జూలై 3, 4వ తేదీల్లో డిగ్రీ, పీజీ, ప్రొ ఫెషనల్‌ విద్యాసంస్థల బంద్‌ పాటిస్తున్నట్టు జా ర్జిరెడ్డి పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు నరేశ్‌ తెలిపారు. కాలేజీ యాజమాన్యాల తీరుతో విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారన్నా రు. ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ జనరల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు రమేశ్‌, శివ, చరణ్‌, సా యి, శ్రీకాంత్‌, రాజు, మహేశ్‌, రాకేశ్‌ ఉన్నారు.

ఘనంగా జగన్నాథ రథయాత్ర 1
1/2

ఘనంగా జగన్నాథ రథయాత్ర

ఘనంగా జగన్నాథ రథయాత్ర 2
2/2

ఘనంగా జగన్నాథ రథయాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement