
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● ఎమ్మెల్యే విజయరమణారావు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ప్రజాసంక్షేమం, పారదర్శక పాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అ న్నారు. జాఫర్ఖాన్పేట, పెద్దరాతుపల్లి, ఇదులా పూర్, ఎన్నంపల్లి గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన, ప్రా రంభోత్సవం చేశారు. రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇ ళ్ల పత్రాలను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల పనుల కు ముగ్గు పోశారు. జాఫర్ఖాన్పేట కొత్త గ్రామపంచాయతీ భవనం, పెద్దరాతుపల్లిలో పల్లెదవాఖా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మహిళా శిశు సంక్షేమం, విద్య, వైద్యం, ఆరోగ్యంపై సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభు త్వం ప్రత్యేక దృష్టిని సారించిందన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ రామచంద్రారెడ్డి, తహసీల్దార్ జగదీశ్వర్రావు, ఎంపీడీవో పూర్ణచందర్రావు, రిటైర్డ్ హెచ్ ఎం నర్సింహారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య తదితరులు పాల్గొన్నారు.
‘రామగుండంలో విధ్వంస పాలన’
గోదావరిఖని: రామగుండం నియోజకవర్గంలో ప్రజాపాలన పేరుతో విధ్వంసం కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. ప్రధాన చౌరస్తా సమీపంలో కూల్చివేసిన షాపులను శుక్రవారం ఆయన పరిశీలించారు. సుందరీకరణ, అభివృద్ధి పేరిట చిరువ్యాపారుల దుకాణాలు తొలగిస్తూ జీవనోపాధిపై దెబ్బతీస్తున్నారన్నారు. పేదల జీవితాలను కాంగ్రెస్ పాలకులు రోడ్డున పడవేస్తున్నారని అన్నారు. రోడ్డు విస్తరణ, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో షాపులను కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం కల్పించిన స్థలంలోనే వేసుకున్న షెడ్లను మళ్లీ కూల్చివేయడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్యయాదవ్, నారాయణదాసు మారుతి, జేవీ రాజు, కల్వచర్ల కృష్ణవేణి, ఐత శివకుమార్, బొడ్డుపల్లి శ్రీనివాస్, అచ్చె వేణు, తోట వేణు, బొబ్బిలి సతీశ్, దొమ్మేటి వాసు, సట్టు శ్రీనివాస్, కుమార్నాయక్ తదితరులు ఉన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం