
ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ సేవలు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, మాతాశిశు సంరక్షణ కేంద్రంలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని, ఇందుకోసం మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ శ్రీహర్ష సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, ఎంసీహెచ్ను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. సమస్యలపై ఆరా తీశారు. బ్లడ్శాంపిల్ సేకరించే ల్యాబ్ వద్ద రద్దీ ఎక్కువగా ఉండడా న్ని గమనించారు. అవసరాన్ని బట్టి సెంటర్లను పెంచాలన్నారు. పేషేంట్లు కూర్చునేందుకు కుర్చీలు, కర్టెన్లు, ఇతర సామగ్రి కోసం ప్రతిపాదనలిస్తే ని ధులు మంజూరు చేస్తానన్నారు. ఆహ్లాదకర వాతావరణం కోసం ఇండోర్ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సూపరింటెండెంట్ శ్రీధర్, ఆర్ఎంవో విజయ్ తదితరులు ఉన్నారు. అంతకుముందు సుభాష్ విగ్రహం వద్ద గల ఎంఈవో కార్యాలయాన్ని కలెక్టర్ శ్రీహర్ష సందర్శించారు. మండల రిసోర్స్ కేంద్రం పనితీరుపై ఆరా తీశారు.
సర్కారు బడుల పనితీరు మెరుగుపడాలి
ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడాలని, సీఆర్పీలు విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో పాఠశాలల నిర్వహణపై సమీక్షించారు. ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ పారదర్శకంగా జరగాలన్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగిన స్కూళ్లలో వసతులు మెరుగుపర్చాలని, అదనపు గదుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. వారంలో ఒకరోజు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు. జీసీడీవో కవిత, ఎస్వో మల్లేశ్, పీఎం షేక్ తదితరులు పాల్గొన్నారు.
పీఎం సూర్యఘర్పై ప్రచారం
ఇంటి కప్పుపై సోలార్ విద్యుత్ ప్యానెల్తో విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన పథకంపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో సౌరశక్తిపై సమీక్షించారు. ప్రతీ మండలంలో కనీసం 500 ఇళ్లపై ఈ పథకం అమలయ్యేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. డీఆర్డీవో కాళిందిని, డీపీవో వీరబుచ్చయ్య తదితరులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచాలి
జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో వనమహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధిహామీ పథకం పనులపై ఎబపీడీవో, ఎంపీవో తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు.