
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ
పెద్దపల్లిరూరల్: పట్టణ శివారులోని పెద్దపల్లి – కూనారం మధ్య రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద చేపట్టిన రైల్వే వంతెన నిర్మాణంలో శుక్రవారం అపశ్రుతి చోటుచేసుకుంది. గడ్డర్ ఏర్పాటు చేసేందుకు అమర్చిన క్లస్టర్ విరిగి అధికారులు, కార్మికులు ఆందోళనకు గురైనా.. వెంటనే అప్రమత్తమయ్యారు. తక్షణమే రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఆగమేఘాలపై విద్యుత్ సరఫరా నిలిపివేయించారు.
ఎక్కడిరైళ్లు అక్కడే..
కాజీపేట – బల్హార్ష సెక్షన్లో విద్యుత్ తీగలకు సరఫరా నిలిపివేయడంతో ఈ మార్గంలోని గూడ్స్, ఎక్స్ప్రెస్ రైళ్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. రాఘవాపూర్ రైల్వేస్టేషన్లో భాగ్యనగర్, జమ్మికుంటలో తెలంగాణ, ఉప్పల్లో ఇంటర్సిటీ, కొలనూర్లో అనువ్రత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. గంటలకొద్దీ రైళ్లు నిలిచిపోవడంతో గమ్యస్థానాలు చేరుకునేందుకు ప్రయాణికులు నానాఇబ్బందులు పడ్డారు. అత్యవసరమైనవారు సమీపంలోని రోడ్లపైకి చేరి బస్సులు, ఇతర వాహనాలను ఆశ్రయించారు.
శరవేగంగా పనులు..
రైల్వేవంతెన వద్ద గడ్డర్కు అమర్చిన క్లస్టర్ విరిగిపోవడంతో ఇతర పరికరాల సాయంతో దానిని తొలగించి మరో క్లస్టర్ అమర్చారు. అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో మధ్యా హ్నం నుంచి రైళ్లరాకపోకలు యథావిధిగా కొనసాగాయి. పనులు సాగుతుండగానే డౌన్లైన్(కాజీపేట వైపు) ఉదయం 11.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించి రైళ్లను నడిపించారు. అప్ (బల్హార్షా వైపు) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రైళ్ల రాకపోకలు ప్రారంభించారు.
ప్రయాణికులకు ఇబ్బందులు
బల్హార్ష, కాగజ్నగర్ నుంచి ఉదయం సికింద్రాబాద్ వెళ్లేందుకు భాగ్యనగర్ రైలు ఒక్కటే ఉంది. వివిధ పనుల కోసం అత్యధిక మంది ఈ రైలులో నే ప్రయాణిస్తారు. అయితే, రాఘవాపూర్ రైల్వే స్టేషన్లో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇ బ్బందులకు గురయ్యారు. పనులు ఎప్పటికి పూ ర్తవుతాయో, రైలు ఎప్పుడు కదులుతుందోననే దానిపై స్పష్టత లేక ఆందోళనకు గురయ్యారు.
రైల్వేబ్రిడ్జి పనుల్లో విరిగిన ‘క్లస్టర్’
విద్యుత్ సరఫరా నిలిపివేత
ఎక్కడికక్కడే ఆగిన రైళ్లు
ప్రయాణికులకు తప్పని అవస్థలు

యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ

యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ