● రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ● బాధితులకు 120 మొబైల్ఫోన్లు అప్పగింత
గోదావరిఖని: సీఈఐఆర్ పోర్టల్ను సద్విని యోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి బుధవారం తన కార్యాలయంలో రూ.18లక్షల విలువైన 120 మొబైల్ ఫోన్లు అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడారు. పోగొట్టుకున్న సెల్ఫోన్ల ఆచూకీ కోసం సీసీఎస్తోపాటు ప్రతీపోలీస్స్టేషన్లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామన్నారు. ఈక్రమంలో సీఈఐఆర్ పోర్టల్లో 6,683 ఫిర్యాదులు అందగా.. ఇప్పటివరకు 2,020 సెల్ఫోన్లు స్వాధీ నం చేసుకొని యజమానులకు అప్పగించామని తెలిపారు. సీసీఎస్, ఐటీ సెల్ పోలీసులు శ్రమించి మరో 120 సెల్ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో 2023 ఏప్రిల్ 19 నుంచి సీఈఐఆర్ పోర్టల్ను అందుబాటులోకి తేగా, మంచి ఫలితాలు రాబట్టామని అన్నారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నవారు, చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్ https://www.ceir.gov.in లో వివరాలు నమోదు చేసి సమీప ఠాణాకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్ ఏసీపీలు మల్లారెడ్డి, శ్రీనివాస్, సీపీఎస్ ఇన్స్పెక్టర్ బాబురావు, ఎస్సైలు మధుసూదన్రావు, నరేశ్, జీవన్, చంద్రశేఖర్, శివకేశవులు తదితరులు పాల్గొన్నారు.