కార్మిక చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

కార్మిక చట్టాలపై అవగాహన అవసరం

May 2 2025 1:28 AM | Updated on May 2 2025 1:28 AM

కార్మ

కార్మిక చట్టాలపై అవగాహన అవసరం

పెద్దపల్లిరూరల్‌: మేడే అంటేనే కార్మిక దినోత్సవమని గుర్తుకొస్తుందని, కానీ కార్మికులు తమహక్కులను సాధించుకునేందుకు అమల్లో ఉన్న చట్టాలపై అవగాహన పెంచుకుంటేనే అది సాధ్యమవుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వరూపరాణి అన్నారు. మే డే సందర్భంగా గురువారం రైల్వే హమాలీలతో జిల్లా కేంద్రంలో సమావేశమై చట్టాలపై పలు సూచనలు చేశారు. మేడే అనగానే ఏ కా ర్మికసంఘానికో ఇది పరిమితమైందని అనుకుంటున్నారని, ఆ అపోహను వీడాలని సూ చించారు. సమావేశంలో ఏజీపీ ఉప్పు రాజు, హమాలీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి : జడ్జి గణేశ్‌

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): ప్రతీఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి గణేశ్‌ అన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా పట్టణంలో గురువారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి మా ట్లాడారు. ప్రతీఒక్కరికి చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుల్తానాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మేకల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయిని భూమయ్య, ఏజీపీ ఆంజనేయులు, సెంకడ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ శంకరయ్య, లోక్‌ అదాలత్‌ సభ్యులు మాడూరి ఆంజనేయులు, చీకటి సంతోష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మహమ్మద్‌ నియాజ్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

కార్మికుల శ్రమదానం గొప్పది

జ్యోతినగర్‌(రామగుండం): దేశాభివృద్ధిలో కా ర్మికుల శ్రమదానం ఎంతోగొప్పదని ఎన్టీపీసీ రామగుండం – తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూ టివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ సామంత అ న్నారు. మేడే సందర్భంగా స్థానిక పార్క్‌లో గు రువారం ఆయన జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికులు ఉత్పాదకత పెంచాలని, వారి హక్కుల గురించి అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు బాబర్‌ సలీంపాషా, ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగ గుర్తింపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో పెరిగిన యూరియా ఉత్పత్తి

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కర్మాగారంలో యూరియా ఉత్పత్తి పెరిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో 1,08,006.93 మెట్రిక్‌ టన్నుల నీమ్‌ కోటెడ్‌ యూరియాను ఉత్పత్తి చేసినట్లు ీసీజీఎం ఉదయ్‌ రాజహంస గురువారం తెలిపారు. ఇక్కడ ఉత్పత్తి చేసిన యూరియాను తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామన్నారు. తెలంగాణకు 39,852.27 మెట్రిక్‌ ట న్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 21,120.12 మెట్రిక్‌ ట న్నులు, కర్ణాటకకు 19,450.71 మెట్రిక్‌ టన్ను లు, మహారాష్ట్రకు 9,051.48 మెట్రిక్‌ టన్నులు, ఛత్తీస్‌గఢ్‌కు 5,259.06 మెట్రిక్‌ టన్నులు, తమిళనాడుకు 7,837.64 మెట్రిక్‌ టన్నులు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి 5,435.64 మెట్రిక్‌ టన్నులు సరఫరా చేశామని ఆయన వివరించారు.

వేసవి శిబిరాలు ప్రారంభం

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో వేసవి శిబిర పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాల ల్లో ఈనెల 1 నుంచి జూన్‌ 10 వరకు సమ్మర్‌ క్యాంపు స్కూళ్ల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. పెద్దపల్లి మండలం నిట్టూరు పాఠశాలలో హెచ్‌ఎం రాజమణి సమ్మర్‌ క్యాంపు ప్రారంభించారు. తొలిరోజు 23 మంది విద్యార్థులు హాజరయ్యారు. క్లస్టర్‌ రిసోర్స్‌పర్సన్‌ సుధాకర్‌, వలంటీర్‌ జ్యోతి పాల్గొన్నారు.

కార్మిక చట్టాలపై   అవగాహన అవసరం 1
1/2

కార్మిక చట్టాలపై అవగాహన అవసరం

కార్మిక చట్టాలపై   అవగాహన అవసరం 2
2/2

కార్మిక చట్టాలపై అవగాహన అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement