మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం

May 2 2025 1:28 AM | Updated on May 2 2025 1:28 AM

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం

● మంత్రి శ్రీధర్‌బాబు

మంథని: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కలెక్ట ర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ అరుణశ్రీతో కలిసి పట్టణంలో గురువారం మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత ము న్సిపల్‌ కార్యాలయంలో శ్రీపాద కుట్టు మిషన్‌ కేంద్రం, ఇందిరా మహిళా శక్తి మొబైల్‌ క్యాంటీన్‌ ప్రారంభించారు. పాత పాలకేంద్రంలో ఉచిత కు ట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అనువైన స్థలం పరిశీలించారు. అనంతరం మంథని డివిజన్‌ మీడి యా ప్రెస్‌క్లబ్‌ కార్యాలయం, ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, ఇందిరా మహిళాశక్తి కా ర్యక్రమంలో భాగంగా మహిళలతో కుట్టు మిషన్‌ కేంద్రాలు, మొబైల్‌ క్యాంటీన్లు తదితర వ్యాపారాల స్థాపనకు కృషి చేస్తున్నామని అన్నారు. అర్హులైన పేదలకు తొలిజాబితాలో 410 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. పాత్రికేయుల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఆర్డీవో సురేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌, తహసీల్దార్‌ కుమారస్వామి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement