
ఆస్పత్రులపై దాడులు చేస్తే సహించేది లేదు
● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ హెచ్చరిక
గోదావరిఖని: ప్రభుత్వ వైద్యాధికారులు, ప్రైవేట్ ఆస్పత్రులు, మెడికల్ షాపులపై దాడులు చేస్తే సహించేది లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైద్యులు దైవంతో సమానమని, అలాంటి వారిపై దాడులు చేస్తే వైద్యానికి దూరమవుతామన్నారు. తక్కువ ఫీజుతోనే వైద్యం అందించే మంచి డాక్టర్లు ఉన్నారని ఆయన తెలిపారు. రామగుండాన్ని మెడికల్ హబ్గా మార్చాలనే ప్రయత్నంలో ప్ర భుత్వ డాక్టర్లు ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తు న్నారని తెలిపారు. మీడియా పేరిట వారిని బ్లాక్మెయిల్ చేస్తే ఊరుకునేది లేదని మక్కాన్సింగ్ హెచ్చరించారు. ఐఎంఏ అధ్యక్షుడు క్యాస శ్రీని వాస్, మాజీ మేయర్, బంగి అనిల్కుమార్, డాక్టర్లు నాగిరెడ్డి, లక్ష్మీవాణి పాల్గొన్నారు.
కార్మికవాడల్లో బీటీ రోడ్ల ఆధునికీకరణ
కార్మిక వాడల్లో బీటీ రోడ్లకు మహర్దశ పడుతోందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. ఆర్జీ–1 ఏరియాలోని సింగరేణి కార్మిక వాడల్లో బీటీ రోడ్డు పనులను జీఎం లలిత్కుమార్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. రూ.5 కోట్ల సింగరేణి నిధులతో 23 కి.మీ. పొడవున తారురోడ్ల ఆధునికీకరణ పనులు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ డీజీఎం కిరణ్బాబు, సివిల్ ఎస్ఈ వరప్రసాద్, ఈఈ వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.