
ప్రజా‘వాణి’.. పరిష్కరించాలని
పెద్దపల్లిరూరల్: ‘సారూ.. నా భూమికి పట్టాదార్ పాసుపుస్తకం ఇప్పించండి’ అంటూ కాల్వశ్రీరాంపూర్ మండలం ఇప్పలపల్లికి చెందిన కనకయ్య ప్రజావాణిలో విన్నవించుకున్నాడు.’ జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై అందించిన వినతులను సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వేణు స్వీకరించారు. సత్వర పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో ఉంచొద్దని, వెంటనే పరిష్కరించాలన్నారు. తిరస్కరిస్తే అందుకు గల కారణాలను ఫిర్యాదుదారులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సమస్యలపై విన్నవించిన బాధితులు
అర్జీలు స్వీకరించిన అడిషనల్ కలెక్టర్ వేణు