కార్మికుల హక్కుల సాధనకు ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

కార్మికుల హక్కుల సాధనకు ఉద్యమం

Apr 24 2025 12:17 AM | Updated on Apr 24 2025 12:17 AM

కార్మికుల హక్కుల సాధనకు ఉద్యమం

కార్మికుల హక్కుల సాధనకు ఉద్యమం

గోదావరిఖని/గోదావరిఖనిటౌన్‌/పాలకుర్తి/రామగిరి: సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం ఉద్య మించాలని టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. బుధవారం రా త్రి గోదావరిఖని టీబీజీకేఎస్‌ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీరేణుకా ఎలమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడుల్లో మృతి చెందిన వారికి కొవ్వొత్తులలో నివాళి అర్పించారు. సెంటినరీకాలనీలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడు తూ, టీబీజీకేఎస్‌ హయాంలో అనేక హక్కులు సా ధించామన్నారు. రాబోయే రోజుల్లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్నారు. మూడుజెండాల పా ర్టీ ఇచ్చింది బోనస్‌ కాదని, బోగస్‌ అని ఎద్దేవా చేశా రు. కేసీఆర్‌ను కలిసి యూనియన్‌ను బలోపేతం చేద్దామన్నారు. సింగరేణిని ఆగం పట్టించిందే ఎర్రజెండా పార్టీ అని విమర్శించారు. ఈనెల 27న నిర్వహించే రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని కోరారు. అంతకుముందు కవితకు పాలకుర్తి మండలంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు మిర్యాల రాజిరెడ్డి, మాదాసు రాంమూర్తి, కాపు కృష్ణ, సురేందర్‌రెడ్డి, కొమురయ్య, సంపత్‌, పర్లపల్లి రవి, ఐలి శ్రీనివాస్‌, అల్లం పద్మ, కాపురబోయిన శ్రీదేవి, కౌశిక హరి, కౌశిక లత, మాదాసు శ్రీనివాస్‌, ముల్కల కొంరయ్య, బండి శ్రీనివాస్‌, బండారి కిరణ్‌, బత్తిని సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కవిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement