జవాబుదారీగా పనిచేస్తున్నా | - | Sakshi
Sakshi News home page

జవాబుదారీగా పనిచేస్తున్నా

Apr 23 2025 8:17 AM | Updated on Apr 23 2025 8:53 AM

జవాబుదారీగా పనిచేస్తున్నా

జవాబుదారీగా పనిచేస్తున్నా

● ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మారం/జూలపల్లి: సేవే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీగా పనిచేస్తున్నానని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. జూలపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ధర్మారంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేడారం రిజర్వాయర్‌ నుంచి లింక్‌ కెనాల్‌ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్‌కు బిల్లలు మంజూరు చేయకపోవడంతో మధ్యలోనే పనులు వదిలేసి వెళ్లారని, రిజర్వాయర్‌ కోసం నామమాత్రపు ధరతో రైతుల నుంచి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భూములు సేకరించిందని, కేసీఆర్‌ హరీశ్‌రావు, కేటీఆర్‌ ఇక్కడి నీటిని తమ ప్రాంతాలకు తరలించుకుపోయారని, అయినా, మాజీమంత్రి పట్టించుకోలేని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే రూ.10 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. త్వరలోనే ధర్మారంలో ఐటీఐ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తిచేసి చివరి ఆయకట్టుకూ సాగునీరు అందిస్తామన్నారు. కలెక్టర్‌ ప్రత్యేక నిధుల నుంచి విడుదలైన రూ.3కోట్లు వెచ్చించి డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మిస్తామని విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. అంతకుముందు జూలపల్లి మండలంలో నీళ్లు అందక ఎండిన వరి పంటను విప్‌ పరిశీలించారు. పెద్దాపూర్‌ శ్రీయోగానంద శ్రీలక్ష్మీనర్సింమస్వామిని దర్శించుకున్నారు. ఖిలావనవపర్తి శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల ప్రచార పోస్టర్‌ ఆవిష్కరించారు. నాయకులు లావుడ్య రూప్లానాయక్‌, అరిగే లింగయ్య, పోల్‌దాసరి సంతోష్‌, యశోద అజయ్‌, గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, సోగాల తిరుపతి, రవీందర్‌రెడ్డి, బొల్లి స్వామి, కొత్త నర్సింహం, కాడే సూర్యనారాయణ, దేవి జనార్దన్‌, ఓరం చిరంజీవి, అష్షు, ఎల్లయ్య, పసునూటి శ్రీనివాస్‌, దండె వెంకటేశం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement