
పర్యావరణాన్ని పరిరక్షించాలి
పాలకుర్తి(రామగుండం): పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా సైన్స్ అధికారి రవినందన్రావు సూచించారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా కన్నాల జెడ్పీ హైస్కూల్ లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆ యన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ ఉంటుందన్నారు. అనంత రం విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, డ్రాయింగ్, నినాదాలు తదితర అంశాల్లో పో టీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేశారు. హెచ్ఎంలు కమలాకర్రావు, అంజనీదేవి, ఉపాధ్యాయులు విఠల్, శ్రీనివాస్, రాజ య్య, జ్యోతి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కుష్ఠు నివారణకు కృషిచేయాలి
కమాన్పూర్(మంథని): కుష్ఠు నివారణకు వై ద్యసిబ్బంది కృషి చేయాలని కుష్ఠు నివారణ మిషన్ రాష్ట్ర బృందం సూచించింది. స్థానిక ప్ర భుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవా రం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతీఇంటికి వె ళ్లి కుష్ఠు లక్షణాలు ఉంటే ప్రాథమిక దశలో ఎండీఈ మాత్రలు వాడితే వ్యాధిని నిర్మూలించవచ్చన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు సంపత్, వెంకటేశ్వరచారి, సకలరెడ్డి, డీఎంహెచ్వో అన్నప్ర సన్న కుమారి, సుధాకర్రెడ్డి, దేవశ్రీ, రమేశ్, పీ హెచ్సీ వైద్యాధికారి సల్మాబేగం పాల్గొన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించాలి