చెరువులో మునిగి ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

చెరువులో మునిగి ఒకరి మృతి

Apr 22 2025 12:09 AM | Updated on Apr 22 2025 12:09 AM

చెరువ

చెరువులో మునిగి ఒకరి మృతి

చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతు

ముస్తాబాద్‌(సిరిసిల్ల): చేపలు పట్టేందుకు వెళ్లి.. వ్యక్తి చెరువులో గల్లంతవగా.. మరొకరు సురక్షితంగా బ యటపడ్డ సంఘటన ము స్తాబాద్‌ మండలం కొండాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై గణేశ్‌ తెలిపిన వివరాలు. కొండాపూర్‌కు చెందిన మహ్మద్‌ రషీద్‌(45), బాబా(30) గ్రా మ శివారులోని పెద్ద చెరువులోకి చేపలు పట్టేందుకు ఆదివారం రాత్రి వెళ్లారు. ఇద్దరు వలతో చెరువులోకి దిగారు. రషీద్‌ చెరువులో ము నిగిపోయాడు. రషీద్‌ కోసం బాబా ఎంత గా లించినా ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామంలోకి వెళ్లి విషయం తెలిపాడు. గ్రామస్తులు పెద్దచెరువులో రాత్రి ఎంత గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం సిరిసిల్ల నుంచి గజఈతగాళ్లను రప్పించారు. వారు రషీద్‌ మృతదేహాన్ని బయటకు తీసుకురావడంతో భార్య షెహనాజ్‌, కూతురు రేష్మ, కుమారుడు రఫీ, బంధువుల రోదనలు మిన్నంటాయి. రషీ ద్‌ ఆరు నెలల క్రితమే దుబాయ్‌ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మూడేళ్ల క్రితం అదే చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి మహ్మద్‌ ఎక్రామ్‌ చనిపోయాడు.

విద్యుత్‌ షాక్‌తో రైతు..

బుగ్గారం: పంటకు నీరు పెట్టడానికి వెళ్లి మో టార్‌ ఆన్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు వైరు త గిలి రైతు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుగ్గారం మండలం గోపులాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్‌, బంధువుల కథనం ప్ర కారం.. గ్రామానికి చెందిన గోవిందుల మల్లేశం(58) సోమవారం ఉదయం పెసరు, ను వ్వుల పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. స్టార్టర్‌ డబ్బా ఇనుపది కావడంతో సర్వీస్‌ వైరు మధ్యలో కొద్దిగా కట్‌ అయిన విషయం తెలియక మోటార్‌ స్టార్ట్‌ చేసేందుకు యత్నించాడు. డబ్బాకు అంటిన సర్వీస్‌ వైరుకు విద్యుత్‌ సరఫరా అయి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మల్లేశం భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఆటో.. బైక్‌ ఢీకొని ఒకరు..

వీణవంక: ఐలబాద్‌ గ్రామ శివారులో ఆటో, బైక్‌ ఢీకొని ఆటో డ్రైవర్‌ కర్నాల నాగరాజు(46)అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్‌లోని కో తిరాంపూర్‌ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ నాగరాజు జమ్మికుంట నుంచి కరీంనగర్‌కు వె ళ్తున్నాడు. ఐలబాద్‌ శివారులో కరీంనగర్‌ నుంచి వీణవంకకు బైక్‌పై వస్తున్న మర్రి రమేశ్‌ అతివేగంతో ఆటోను ఢీ కొట్టాడు. దీంతో నాగరాజు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. రమేశ్‌, బైక్‌ వెనక కూర్చున్న మల్లేశం తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య దేవలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు.

సాగునీరు విడుదల చేయాలి

జూలపల్లి: సాగునీరు లేక వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోయే అవకాశం ఉందని, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయించాలని బీజేపీ జాతీయ కౌన్సిల్‌ మెంబర్‌ గుజ్జుల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం జూలపల్లిలో మాట్లాడారు. శ్రీరాంసాగర్‌ డీ– 83,86 కెనాల్‌ ద్వారా నీటిని విడుదల చేయాలని, లేకుంటే ఎల్లంపల్లి నీటిని రాగంపేట వద్ద కెనాల్‌కు అనుసంధానం చేసి నీరివ్వాలని డిమాండ్‌ చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే నాయకులు రైతు భరోసా, రుణమాఫీ ఇప్పటికి పూర్తి చేయలేదని విమర్శించారు.

చెరువులో మునిగి ఒకరి మృతి1
1/1

చెరువులో మునిగి ఒకరి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement