
జీజీహెచ్లో పనిచేయని ఫ్రీజర్లు
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో బాడీ ఫ్రీజర్లు ప నిచేయడం లేదు. మార్చురీలో మూడు ఫ్రీజర్లు ఉండాల్సి ఉండగా, ఒకటే పనిచేస్తోంది. మిలిగిన రెండు పనిచేయడం లేదు. దీంతో ఎక్కువ సంఖ్యలో మృతదేహాలు మార్చురీకి వచ్చినప్పుడు వాటిని ఫ్రీ జర్లో పెట్టేందుకు అవకాశం లేకపోవడంతో ఆస్ప త్రి సిబ్బందితోపాటు మృతుల కుటుంబాలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం రా త్రి ప్రత్యూష అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం పోస్టుమార్టం చేయాల్సి ఉంది. దీంతో ఆ మృతదేహాన్ని మార్చురీలో ఉంచడానికి వన్టౌన్ పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు జీజీహెచ్కు తీసుకొచ్చారు. సోమవారం రాత్రి రైలు ప్రమాదంలో మృతి చెందిన ఓ యువకుడి మృతదేహాన్ని పని చేస్తున్న ఫ్రీజర్లో పెట్టి ఉంచడంతో ఆస్పత్రి సి బ్బంది ఏం చేయలేమని చేతులెత్తేశారు. దీంతో యువతి మృతదేహం పాడవకూడదని భావించిన మృతురాలి తండ్రి విఠల్.. డబ్బులు వెచ్చించి అద్దె కు ఫ్రీజర్బాక్స్ తెప్పించి అందులో తన కూతురు మృతదేహాన్ని పెట్టాల్సి వచ్చిందని ఆవేదనతో తెలిపాడు. బోధాన ఆస్పత్రిగా అభివృద్ధి చెందుతున్న జీజీహెచ్లో అన్నివసతులు కల్పిస్తున్నామని చెబుతున్న అధికారులు.. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనిచేయని ఫ్రీజర్లపై అనేక ఫిర్యాదులు వచ్చినా స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
యంత్రాంగం తీరుపై నిరసన